తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 105మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలు పెట్టేసింది. మరో వైపు టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెలంగాణ మహాజనసమితి మహాకూటమిగా ఏర్పడినా ఈ పార్టీల మధ్య ఇంకా సీట్ల సద్దుబాటు చర్చలే జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, టీడీపీ మధ్య సీట్ల సద్దుబాటు ఓ పట్టాన కొలిక్కి వచ్చేలా కనపడడం లేదు. టీడీపీ గత ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 15 సీట్ల‌లో విజయం సాధించింది. ఇందులో ఎక్కువ సీట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ పట్టుపడుతుండడం.. అక్కడే కాంగ్రెస్‌ నుంచి కూడా బలమైన అభ్యర్థులు ఉండడంతో ఏ సీట్లు ఎవరు తీసుకోవాలి అనేదానిపై క్లారిటీ ఉండడం లేదు. 

Image result for telangana

మరో వైపు టీడీపీకి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ తక్కువ సీట్లు కేటాయించే ఛాన్సులు ఉన్నాయి. అక్కడ పార్టీ తరుపున పోటీ చేసే ఆశావాహులు చాలా ఎక్కువగా ఉన్నారు. దీంతో తమకు వచ్చిన సీట్లలోనే ఎవరికి ఏ సీటు కేటాయించాలి అన్నది కూడా టీడీపీ ఓ పట్టాన తేల్చుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీడీపీ కచ్చితంగా పోటీ చేసేస్థానాల్లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి సంస్థాగతంగా మంచి బలముంది. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు విజయం సాధిస్తే శేరిలింగంపల్లి నుంచి అరికెపుడి గాంధీ ఏకంగా 75 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో  ఘ‌న‌విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఈ రెండు సీట్లను టీడీపీ కోరుతుంది. 


కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి సీట్ల నుంచి మొదటిలో ఏదో ఒక స్థానం నుంచి నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరో కళ్యాణ్‌ రాం పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు వార్తలుగానే మిగిలిపోయాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త ఏంటంటే గ్రేటర్‌ హైదరాబాద్‌కు గుండెకాయలాంటి నియోజకవర్గమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంను తెలుగుదేశం పార్టీ ఓ టాలివుడ్‌ నిర్మాతకు ఖ‌రారు చేసినట్టు తెలుస్తోంది. బాలయ్యకు అత్యంత సన్నిహితుడు అయిన భవ్యక్రియేషన్స్‌ అధినేత, నిర్మాత ఆనంద్‌ ప్రసాద్‌కు శేరిలింగంపల్లి కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. బాలయ్యతో ప్రసాద్‌కు ఉన్న సాన్నిహిత్యంతో పాటు అక్కడ సామాజికవర్గం పరంగా ఆనంద్‌ప్రసాద్‌కే శేరిలింగంపల్లి టీడీపీ సీటు దక్కుతుందని తెలంగాణ టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్‌తో ఎక్కువ సినిమాలు తీసే భ‌వ్య ఆనంద్‌ప్ర‌సాద్ బాల‌య్య‌తో పైసా వ‌సూల్ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: