జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా రెండవ విడత ప్రజాపోరాట యాత్రలో చింతమనేని ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలు టోటల్ రాష్ట్రాన్నే కలకలం సృష్టించాయి. దీంతో పవన్ చింతమనేని గురించి ఏపీ పాలిటిక్స్ లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే పవన్ ఇటీవల తన పార్టీ తరఫున పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన ప్రజా పోరాట యాత్ర ముగిసిన నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన చింతమనేని మరొకసారి రెచ్చిపోయారు.

Image may contain: 4 people, people smiling, crowd, beard and outdoor

తాను కళ్లు ఎర్ర చేస్తే పవన్ కళ్యాణ్ దెందులూరులో సమావేశం పెట్టగలిగేవాడా అని ప్రభాకర్ ప్రశ్నించారు.టిడిపి కుటుంబంలో ఉన్నందున తాను సంయమనంగా ఉన్నానని ఆయన అన్నారు.దెందులూరు నుంచి పవన్ ను పోటీచేయమంటే ఎవరినో పెడతానంటున్నారని ప్రబాకర్ ఎద్దేవ చేశారు.తన రౌడియిజం పేదవాడి సమస్యలను పరిష్కరించడం కోసమేనని ఆయన చెప్పారు.

Image result for pawan kalyan chintamaneni

కొందరు విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని, కులపిచ్చి తేవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.బిజెపినే జగన్,పవన్ లతో ఆడిస్తోందని ఆయన ఆరోపించారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో నాపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. దీంతో చింతమనేని పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Image result for pawan kalyan chintamaneni

ఒక ఆకు రౌడీ గాలి రౌడీ గురించి పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోరని ప్రజలపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ పై మండిపడ్డారని చింతమనేనికి కౌంటర్లు వేస్తున్నారు. దీంతో తాజా చింతమనేని వ్యాఖ్యలతో మరొకసారి పవన్ చింతమనేని టాపిక్ సోషల్ మీడియాలో అలాగే ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశమైంది.



మరింత సమాచారం తెలుసుకోండి: