టీడీపీ కి కేవలం నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని తాజాగా సర్వే లో బయటిపడింది. అయితే ఇంత లోనే వైసీపీ ఆనంద పడితే పరిస్థితి మొదటికి వస్తుంది. జాతి మీడియా భజన చేస్తున్నా.. జాతీయ మీడియా మాత్రం.. బాబు కథ అయిపోయిందని చెబుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే. అయితే.. ఈ సర్వేలను చూసి సంతోషంలో మునిగిపోయి, ఆనంద పడుతూ ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కథ అంతే అని కూడా చెప్పక తప్పదు.

Image result for chandrababu and jagan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు సంబరాల్లో మునిగిపోతే, ఆ తర్వాత నిండా మునిగిపోయేది ఆ పార్టీనే. గత ఎన్నికల ముందు పరిణామాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరిచితే మళ్లీ ఆ పార్టీ దెబ్బతినక తప్పదు. తాము గెలిచేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు వందశాతం నమ్మారు. ఆఖరికి కొంతమంది అభ్యర్థులు ఎలా తయారయ్యారంటే.. జగన్ హవా ఉంది కదా.. ఇక జనాలను తామెందుకు ఓటు అడగాలన్నట్టుగా వ్యవహరించారు.

Image result for chandrababu and jagan

ప్రచారం కూడా అవసరం లేదు.. జగన్ ను చూసి జనాలు ఓటేస్తుండగా తామెందుకు కష్టపడి వెళ్లి జనాలను ఓటు అడగాలన్నట్టుగా ఫీలయ్యారు. ఇలాంటి వారి తీరు వల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అధికారానికి దూరం అయ్యింది. ఇప్పుడు ఈ ముందస్తు సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్న తరుణంలో.. మళ్లీ వైసీపీ శ్రేణులు ఈ వాపును చూసి బలం అనుకుంటే.. అంతే సంగతులు

మరింత సమాచారం తెలుసుకోండి: