సాధారణంగా కొన్ని జంతులువు చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే..చోద్యం అనిపిస్తుంటుంది..నవ్వు పుట్టిస్తుంది.  ముఖ్యంగా కోతి చేష్టలు చూసిన వారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం చూస్తుంటాం. అయితే కొన్ని సార్లు కోతులు, కొండముచ్చులు మనుషులపై అటాక్ కూడా చేస్తుంటాయి.  తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది.  కర్ణాటకలోని  దావణగెరె డివిజన్ లో కేఎస్ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్న ప్రకాష్ యధావిధిగా బస్సు నడుపుకుంటూ వెళ్తున్నాడు. అనుకోకుండా డ్రైవర్ వద్దకు ఓ కొండముచ్చు వచ్చింది..అది కాస్త స్టీరింగ్ పట్టుకోవడంతో కొండముచ్చుకు స్టీరింగ్ అప్పగించిన ఆయన, అది స్టీరింగ్ పై కూర్చుని అటూ ఇటూ తిప్పుతుంటే చోద్యం చూశాడు.

ఈ వీడియోను చిత్రీకరించిన ఓ ప్రయాణికుడు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. దావణగెరె నుంచి బ్రహ్మసాగర వెళుతున్న బస్సులో ఈ నెల 1న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కాగా, బస్సులోకి ఈ కొండముచ్చు ఓ ఉపాధ్యాయుడి వెంట వచ్చిందని, అతను ఇదే బస్సులో నిత్యమూ ప్రయాణిస్తుండాటని తెలుస్తోంది. 

అనుకోకుండా ఆ కోతి అక్కడా ఇక్కడా గెంతడంతో  భయాందోళనలకు గురైన ఇతర ప్రయాణికులు దాన్ని తొలగించాలని డ్రైవర్ కు సూచించినా, ఆయన వినలేదన్న ఫిర్యాదులూ వచ్చాయి. పైగా తను డ్రైవింగ్ సీటులో కూర్చుని, స్టీరింగ్ పై కొండముచ్చును కూర్చోబెట్టాడు. డ్రైవర్ ను విధుల నుంచి తొలగించామని, అతనిపై విచారణకు ఆదేశించామని, అధికారి ఒకరు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: