తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తారీఖున ఎన్నికలు అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచార పర్వంలో మరింత స్పీడ్ పెంచారు. ప్రస్తుతం కెసిఆర్ మహాకూటమి ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. గతంలో ముందస్తు ఎన్నికలు ప్రకటించగానే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన కేసిఆర్ తనకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు అవుతున్న కాంగ్రెస్ నాయకులపై ముఖ్యంగా చంద్రబాబుపై సంచలన కామెంట్ చేస్తూ తెగ ఊగిపోతున్నారు.

Related image

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గత కొన్నాళ్ల నుండి కాంగ్రెస్ పార్టీపై ఈ అలాగే చంద్రబాబుపై చేస్తున్న కామెంట్లకు సరైన రీతిలో కౌంటర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ ఆంధ్ర అంటూ పాత స్వరం ఎత్తి తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి రెడీ అవుతున్నట్లు పేర్కొన్నారు.

Image result for revanth reddy kcr

ఇటీవల కుత్బుల్లాపూర్ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి...‘ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్, మోదీ కాళ్ల వద్ద మోకరిల్లాడు. ఎన్నికల్లో ఏ హామీ నెరవేర్చని కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని అమ్మనా...బొమ్మనా అంటున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలి. కేసీఆర్‌కు మళ్లీ అధికారం దక్కదనే భయం వెంటాడుతోంది. అందుకే నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

Related image

తాగి బండి నడిపే వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు... తాగి ప్రభుత్వం నడుపుతున్న కేసీఆర్ ను ఏమీ చేయలేరా. మందుతాగి రాష్ట్రాన్ని నడుపుతున్న కేసీఆర్‌ను అండమాన్ జైల్లో పెట్టాల్సిన బాధ్యత పోలీస్‌లకు లేదా. తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ చంద్రబాబు నాయుడిని తెరమీదకు తెస్తున్నాడు. అంటూ సంచలన కామెంట్ చేసి కేసీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలకు తెలియజేశారు రేవంత్ రెడ్డి.


.



మరింత సమాచారం తెలుసుకోండి: