దున్న పోతు ఈనిందంటే దూడకు కట్టేయమనే రకంగా అతి తొందరపాటుకు నిదర్శనంగా తెలుగు తమ్ముళ్ళు నిలిచారు. పైగా ప్రతీ దాన్ని రాజకీయం చేయడం నేర్చుకున్నారు. ఎదురుదాడికి పెట్టింది పేరుగా తయారయ్యారు. మరి ఈ రకమైన శిక్షణ అప్పట్లో హిట్ అయినా ఇటీవల కాలంలో బూమరాంగ్ అవుతోంది. చివరికి నాలిక కరచుకోవాల్సివస్తోంది.
హత్యా రాజకీయం :
విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. దీన్ని అంతా ఖండించారు. అయితే ఈ హత్యల విషాదం ఇలా ఉండగానే టీదీపీ మరో వైపు రాజకీయం మొదలెట్టేశారు. ఈ హత్యల వెనక వైసీపీ నేతలు ఉన్నారని ప్రచారం స్టార్ట్ చేశారు. విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణెష్ కుమార్ అయితే జగన్ హస్తం ఉందన్న వరకూ వెళ్ళారు.
సీన్ కట్ చేస్తే :
ఈ హత్యల తరువాత చంద్రబాబు ప్రభుత్వం సీనియర్ అధికారి ఫకీరప్ప నాయకత్వంలో విచారణ కమిటీ (సిట్) ని ఏర్పాటు చేసి ముమ్మరంగా దర్యాప్త్ జరిపించింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దాంతో ఖంగు తినడం ఆరోపణలు చేసిన టీడీపీ పెద్దల వంతైంది.
టీడీపీ నేతలే :
హత్యల వెనక ఉన్నది టీడీపీ నేతలేనని పోలీసుల విచరణలో వెల్లడైంది. ఆ పార్టీకి చెందిన అరకు తూటంగా గా పంచాయతి ఎంపీటీసి ఏదుల సుబ్బారావు, ఆయన భార్య లక్ష్మి, టీడీపీ నాయకుడు శోభన్, అతని మేనత్త కోమల ఈ హత్యకు ప్రధాన సూత్రధారులుగా పోలీసులు తేల్చేశారు. అయితే ఇపుడు విచారణ పూర్తి అయినా బయట పెట్టకుండా పోలీసులు ఇంకా సస్పెన్స్ లోనే ఉంచారు. బయట పెడితే అధికార పార్టీ హస్తం ఉందని వెల్లడవుతుంది.
దాంతో వైసీపీ పై చేసిన ఆరోపణలు తప్పని తేలిపోయి మొత్తం పరువు పోతుంది. దాంతో పోలీసులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారని భోగట్టా. ఇప్పటికి పదిహేను రోజులు పైదాటింది, అయినా అసలు బాధ్యులు ఎవరో బయటకు వెల్లడించకపోవడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది.