ప్రముఖ పాత్రికేయులు, రచయిత కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.   ప్రస్తుతం సాక్షి టీవీ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ గా కొనసాగుతున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఏకైక కుమారుడు శ్రీహర్ష (32) కెనడాలో భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం మృతిచెందారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న శ్రీహర్ష రెండేళ్లుగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కొమ్మినేని దంపతులు ఇటీవలే కెనడా వెళ్లారు. కొడుకు మరణంతో ఈ దంపతులు విషాదంలో మునిగిపోయారు. ఈ మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు కొమ్మినేనిని ఫోన్లో పరామర్శిస్తు న్నారు.


కొమ్మినేని శ్రీనివాసరావు అలియాస్ కేఎస్సార్ గా మంచి పేరుంది. శ్రీహర్ష మృతిపట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భగవంతుడు ఆయనకు ఈ శోకాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కల్పించాలని జగన్‌ ఫోన్‌లో కొమ్మినేనిని ఓదార్చారు. 


కొమ్మినేని శ్రీనివాసరావు  సాక్షి లో చేరక ముందు ఎన్టీవీలో చీఫ్ ఎడిటర్ గా పని చేశారు. వీటికంటే ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, దూరదర్శన్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ఎలెక్షన్ల మీద, శాసన సభ చర్చల సరళి మీద పుస్తకాలు రచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: