తెలంగాణలో కాంగ్రెస్టీడీపీ పొత్తుపై సమాధానం చెప్పాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలని లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. గతంలో టీఆర్ఎస్...కాంగ్రెస్ ,టీడీపీలతో షరతులతో కూడిన పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు చివరి దాకా తెలంగాణను అడ్డుకున్నారని...ఆయన ఎప్పటికే ఆంధ్ర బాబే అన్నారు.

Image result for telangana

తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రి పదవులను తృణప్రాయంగా కూడా వదులుకున్నామని హరీశ్ రావు చెప్పారు. ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామాలు చేశామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలు టీడీపీతో మహా కూటమిగా ఏర్పాటవుతున్నది షరతులతోనా? కాదా? అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. మహా కూటమి కొందరు నేతల వ్యక్తీ గత స్వార్ధం కోసమే తప్ప ...తెలంగాణ ప్రయోజనాల కోసం కాదన్నారు. తెలంగాణ సామాన్య జనం మహాకూటమి ఏర్పాటును చీదరించుకుంటున్నారని అన్నారు.


కేసీఆర్ పదకొండు రోజుల దీక్షతో చావు నోటి దాకా వెళ్లారని...కెసిఆర్ చిత్తశుద్ధి ఆలా ఉంటే మహాకూటమి నేతలు పరాయి పాలనకు మొగ్గు చూపుతున్నారని దుయ్యబట్టారు.  పోలవరం, నదీ జలాల పంపిణీ, హైకోర్టు, ఆస్తుల పంపకం లాంటి విషయాల్లో చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాల పట్ల వ్యతిరేకత చూపుతున్నారని ఏకంగా ప్రధాని కూడా చెప్పారని హరీశ్ అన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళితే కేవలం తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడతారని ప్రధాని చెప్పారని అన్నారు. 


ఇకపై తెలంగాణకు వ్యతిరేకంగా వాదించనని, ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన వంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తానని చంద్రబాబు ఒప్పుకున్నారా?

కాళేశ్వరం, తమ్మిడిహట్టి, సీతారామ, తుపాకుల గూడెం, దేవాదుల, పెన్ గంగ, రామప్ప-పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు వాటిని వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పగలరా?

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం రామాలయం సహా, తెలంగాణలో లక్ష ఎకరాలు నీట మునుగుతాయి. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? ‘పోలవరం’పై కాంగ్రెస్, చంద్రబాబు వైఖరులేంటి? తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయగలరా?

 పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించేందుకు తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? ‘పాలమూరు- రంగారెడ్డి’పై చంద్రబాబు వైఖరేంటి? చంద్రబాబు వైఖరి చెప్పకుండా పొత్తుపెట్టుకుంటే అది తెలంగాణ ప్రజలకు విఘాతం కాదా?

- నిజాం హయాం నాటి ఆస్తులు తెలంగాణకే తప్ప, ఏపీకి ఉండదనే సత్యాన్ని చంద్రబాబు అంగీకరించారా? ఈ విషయమై కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని బాబుతో ఒప్పందం ఏమైనా చేసుకున్నారా?

 పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల వాటా కేటాయించడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా?

— ‘తెలుగు జాతి’ అని మాట్లాడే చంద్రబాబు.. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇవ్వడానికి తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై కేంద్రానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారి.. మరి అది తప్పేనని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారా?

- విద్యుత్ శాఖలో 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థిక భారం తగ్గిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కోర్టు కేసులను ఉపసంహరింపజేస్తారా?

- తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాడుతానని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా?

- పోలవరం 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందా?

- సీలేరు ప్రాజెక్టు వెనక్కి ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నారా? ఈ ప్రాజెక్ట్ కు బదులుగా తెలంగాణకు ఏమైనా నష్టపరిహారం ఇచ్చేందుకు బాబుతో ఒప్పందం చేసుకున్నారా?

- హైకోర్టు సత్వర విభజన సహా, ప్రభుత్వ సంస్థల విభజనలో స్తంభన తొలగించడానికి చంద్రబాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా? 

మరింత సమాచారం తెలుసుకోండి: