ప్రపంచలో ఎన్నో అందాలు..ఆ అందాలను మన కళ్లముందు ఉంచేది ఫోటోగ్రఫి.  ప్రపంచంలో మనం చూడలనేని.. ఊహించలేని ఫోటోలను ఎంతో మంది తమ కెమెరాతో బంధించి కళ్ల ముందు ఉంచుతారు.  ఫోటో అంటేనే మరుపురాని గుర్తు అంటారు..అందుకే ఫోటోలు అంటే ఎవరైనా ఇష్టపడతారు.   తాజాగా ఏపిలో ప్రతిపక్ష నేత ‘ప్రజా సంకల్ప యాత్ర’చేస్తున్న విషయం తెలిసిందే.  తన పాదయాత్రలో అలసిపోయి, చమటపట్టిన స్థితిలో ఉన్న జగన్ ముఖాన్ని ఓ యువతి తన కొంగుతో తుడుస్తోంది..అదే సమయంలో ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించాడు.  అంతే ఆ ఫోటో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. 

ఈ ఫోటో మానవత్వపు కోణంలో కనిపిస్తుంది.  కాగా, స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఈ ఫొటోకు అవార్డు లభించింది. స్పాట్ న్యూస్, జనరల్ న్యూస్ విభాగాల్లో ఫొటోలను ఆహ్వానించిన ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్, వాటి నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసింది. 

గెలుపొందిన విజేతలకు నవంబర్ 1న విజయవాడలో అవార్డులను అందిస్తామని అన్నారు. అవార్డుల్లో భాగంగా తొలి, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలు, కన్సొలేషన్ బహుమతులతో పాటు ప్రత్యేకంగా శ్యాప్ ఎచీవ్ మెంట్ అవార్డులు, ఎఫ్సీఐ హానరబుల్ మెన్షన్ అవార్డులు అందించనున్నామని కాంటెస్ట్ చైర్మన్ టీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: