వైసిపి అధినేత ప్రతిపక్షనేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఏపీ రాజకీయాలలో అనేక సంచలనాలు సృష్టించిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇప్పటికే జగన్ పాదయాత్ర తో మూడు వేల కిలోమీటర్లు నడిచి దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు మరియు ప్రతిపక్ష నేత నడవని విధంగా ప్రజా సమస్యల కోసం ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ దూసుకుపోతూ చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా జగన్ తలపెట్టిన యాత్ర వైసీపీ పార్టీ గ్రాఫ్ అమాంతం పెంచింది అనటంలో మరియు అదే విధంగా కూటమిగా ఉన్న బిజెపి, జనసేన, టీడీపీ పార్టీలను చీల్చింది అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Related image

ఈ క్రమంలో పాదయాత్ర చివరి కోస్తున్న నేపథ్యంలో జగన్ తన రాజకీయ సలహాదారుడు అయినా ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలను తెప్పించుకుని మరీ పరిశీలించారట. ఈ క్రమంలో ఈ సర్వేలో రానున్న ఎన్నికల్లో దాదాపు వంద సీట్లకు పైగా వైసీపీ పార్టీ అవలీలగా గెలుచుకుంటుంది అని సర్వేలో తేలడంతో కొంత సంతోషించారు జగన్. ఇదే క్రమంలో ఎవరు ఏ సెగ్మెంట్లో గెలుస్తారు అన్నదానిపై ఎవరికీ తెలియకుండా ప్రశాంత్ కిషోర్ చేత జగన్ సీక్రెట్ సర్వే నిర్వహించారట.

Related image

ఈ సీక్రెట్ సర్వే ఫలితాలు కూడా జగన్ చేతిలో ఉన్నాయి..దీంతో ఆయా సెగ్మెంట్లో నాయకులు ఈ విషయం తెలుసుకుని కొంత భయానికి ఆందోళనకు గురవుతున్నట్లు వైసీపీ పార్టీ నాయకులో టాక్. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు జగన్ ఫేం అడ్డం పెట్టుకుని ఆయా సెగ్మెంట్లో గెలిచేదం అనుకుంటున్న వారి పై జగన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అంట..

Related image

తాను కష్టపడుతుంటే మరోపక్క నియోజకవర్గాలలో కష్టపడకుండా 2014 ఎన్నికల లాగా కేవలం పార్టీ అధ్యక్షుడు బట్టి ఓట్లు కొల్లగొడదం అని అనుకుంటున్న వారికి ఎన్నికల ముందే సవాల్ అని జగన్ పీకే తో ఈ సీక్రెట్ సర్వే నిర్వహించారు అని సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం జగన్ చేతిలో ఉన్న ఈ సీక్రెట్ సర్వే ఫలితాలు విషయంలో ఆయా సెగ్మెంట్లో ఉన్న నేతలకు  బిక్కుబిక్కుమంటూ భయం పట్టుకుందట. మరి రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎవరికి టికెట్ ఉంటుందో ఎవరికి టికెట్ ఉండధో ఈ సర్వే ఫలితాల ద్వారా తేలిపోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: