ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి మీద మరియు టీడీపీ ఎంపీలు , మంత్రుల మీద ఐటీ దాడులు జరిగిన సంగతీ తెలిసిందే.  వరుసగా టీడీపీ నేతల ఇళ్ళపై ఐటీసోదాలు షురూ అయ్యాయి. బీద మస్తాన్‌ రావు, సీఎం రమేష్‌ ఇళ్ళ మీద, కార్యాలయాల మీదా ఐటీసోదాలు అందులో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. అదెంత నిజం.? అన్నది వేరే విషయం. రాజకీయంగా ఈ తరహా అనుమానాలు వెల్లువెత్తడం సహజమే. ఈ సోదాలు ముందు ముందు ఇంకా ఉధృతం కాబోతున్నాయంటూ టీడీపీ వర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమువుతండడం గమనార్హం.

Image result for chandra babu

తాజాగా, ఈ ఐటీ సోదాల విషయమై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ స్పందించారు. 'ఐటీ సోదాలు వ్యాపారస్తుల మీద జరుగుతున్నాయి.. ముఖ్యమంత్రి మీద జరగలేదు కదా..' అని తేల్చేశారాయన. అంటే, జనసేన - చంద్రబాబు మీద కూడా ఐటీసోదాలు జరగాలని ఆశిస్తున్నట్లే వుంది. ఎక్కడో ఢిల్లీలో ఇలాంటివి కుదురుతాయిగానీ.. ఇతర రాష్ట్రాల్లో అంత తేలికైన వ్యవహారం కాదు మరి. అయినాగానీ, ఆ అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేం.

చంద్రబాబుపైనా ఐటీదాడులు జరుగుతాయా.?

చాలా ముఖ్యమైన అంశాలపై స్పందించాల్సి వచ్చినప్పుడు, చాలా తేలిగ్గా స్పందించేస్తుంటారు పవన్‌కళ్యాణ్‌. ఆ కోవలోనే, చంద్రబాబుపై ఐటీ దాడులు జరగడంలేదు కదా.. అనేశారుగానీ, చంద్రబాబుపై ఐటీ దాడులు జరిగితే పరిస్థితి ఏంటి.? అన్న ఆందోళన ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో బయల్దేరింది. ఇది పరువు సమస్య. ఐటీ అధికారులు వచ్చి, ఏవో నాలుగు పత్రాలు తీసుకెళ్ళి.. వాటికి మరో పది విషయాలు లీకుల రూపంలో బయటకు వచ్చి.. ఆ తర్వాత జరిగే రచ్చ ఓ రేంజ్‌లో వుంటుంది. అయితే, ఇదంతా 'ఓవర్‌ ది బోర్డ్‌' వ్యవహారమే.

మరింత సమాచారం తెలుసుకోండి: