ఇప్పటి వరకూ ఈడీ, ఐటి దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబునాయుడు అండ్ కో పై త్వరలో సిబిఐ కూడా గురిపెట్టినట్లుంది. త్వరలో చినబాబు నారా లోకేష్ పై దాడులు జరిపేందుకు సిబిఐ రంగం సిద్ధమైనట్లు టిడిపికి మద్దతుగా నిలిచే మీడియానే గగ్గోలు పెట్టేస్తోంది. టిడిపి మీడియానే ఆ విషయం చెబుతోంది. నారా లోకేష్ లక్ష్యంగా దాడులు చేయటానికి సిబిఐ అధికారులు రెడీ అవుతున్నారంటూ మీడియా మొదలుపెట్టింది.


ఇంతకీ విషయం ఏమిటంటే ? పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటి శాఖలను నారా లోకేష్ చూస్తున్న విషయం తెలిసిందే. ఐటి పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ పెద్ద ఎత్తున భూములు, రాయితీలను ఇచ్చేస్తోంది. పరిశ్రమలు రావాలంటే మౌళిక సదుపాయాల కల్పనతో పాటు రాయితీలు కూడా ఇవ్వక తప్పదు కదా ? ఆ ముసుగులో తమ బినామీలకు, టిడిపి నేతలకే లోకేష్ పెద్ద ఎత్తున భూములను కేటాయిస్తున్నారంటూ ఆరోపణలు మొదలయ్యాయి. ప్రోత్సాహకాల పేరుతో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి లోకేష్ పాల్పడుతున్నట్లు బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆరోపిస్తున్నారు.


ఇవే ఆరోపణలపై ఓ మాజీ న్యాయమూర్తి చంద్రబాబునాయుడు, లోకేష్ పై విచారణకు కేసు వేస్తే ఆధారాలు తీసుకురమ్మంటూ కోర్టు పిటీషన్ ను పక్కన పెట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే బిజెపి నేతలు కేంద్రమంత్రిత్వశాఖలకు లోకేష్ పై ఫిర్యాదులు చేశారట. దాంతో కేంద్రం ఆదేశాలతో సిబిఐ త్వరలో దాడులకు దిగుతోందట. నేరుగా లోకేష్ పైనే దాడులు చేయనక్కర్లేదు. చినబాబు చూస్తున్న శాఖలపై దాడులు చేసినా చాలు. ఇప్పటికే ఈడీ, ఐటి దాడులతో గోల చేసేస్తున్న  టిడిపి నేతలు లోకేష్ పై సిబిఐ కూడా దాడులు చేస్తే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: