కేంద్రం లో ప్రధాని ని డిసైడ్ చేసేది చంద్ర బాబు నాయుడే నని లోకేష్ ఎప్పుడు చెబుతుంటాడు.  మరి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో వచ్చేదే నాలుగు ఎంపీ సీట్లని సర్వేలు చెబుతున్నాయి. ఆ ఎంపీ సీట్లతోనే ప్రధానిగా ఎవరుండాలో చంద్రబాబు డిసైడ్ చేసేస్తాడా? అనే వ్యంగ్యం అయితే తప్పడంలేదు.14 ఎంపీ సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు తేల్చింది ఏమీలేదు. ఇక రేపు ఎన్నికల్లో ఎన్నొస్తాయో తెలీదు కానీ.. చంద్రబాబు మాత్రం ప్రధానిగా ఎవరుండాలో తేల్చుతాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి.


పవన్ మీద భగ్గుమంటున్న శ్రీకాకుళం.. కాకమ్మ కబుర్లు చెప్పడం మాను పవన్...!

టీడీపీ అలాంటి కామెడీ చేస్తుంటే.. ఈ విషయంలో మేమేం తక్కువ? అంటోంది జనసేన. ఈ పార్టీ వర్గాలు కూడా రేపు దేశానికి ప్రధానిగా ఎవరుండాలో తేల్చేది పవన్ కల్యాణే అంటున్నాయి. జనసేన ఇచ్చే సపోర్టును బట్టే ఎవరో ఒకరు ప్రధాని అవుతారని ఈ పార్టీ వాళ్లు అంటున్నారు. జనసేన పార్టీకి బ్రహ్మాండమైన వేవ్ ఉందని.. భారీగా ఎంపీ సీట్లను నెగ్గేస్తుందని.. వాటితో ప్రధానిగా ఎవరుండాలో పవన్ డిసైడ్ చేసేస్తారని ఈ పార్టీ వాళ్లు బాకా ఊదుతున్నారు.


పవన్ మీద భగ్గుమంటున్న శ్రీకాకుళం.. కాకమ్మ కబుర్లు చెప్పడం మాను పవన్...!

వైసీపీ వాళ్లు మాత్రం ఎవరు రాష్ట్రానికి హోదా అంటే వాళ్లకే సపోర్ట్ అంటున్నారు. టీడీపీ, జనసేనలు మాత్రం.. ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేది మేమే అంటున్నాయి. అయినా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే ఎక్కడా ఒక్క ఎంపీ సీటును నెగ్గలేకపోయారు. ఇప్పుడు జనసేనతో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేస్తాం అంటే దీన్ని మామూలు కామెడీ అనాలా?

మరింత సమాచారం తెలుసుకోండి: