పవన్ తలపెట్టిన కవాతు కు జనాలు భారీగా తరలివచ్చారు . పవన్ కళ్యాణ్ ఎలాగూ స్టార్ కాబట్టి ఆ మాత్రం జనాలు వస్తారని అందరూ భావించారు అయితే ఇదే విషయం మీద టీడీపీ ఎదురు దాడికి దిగుతున్నారు. కమెడియన్ వచ్చిన జనాలు వస్తారని పవన్ ను వెటకారంగా మాట్లాడినారు. అయితే ఈ సభలో పవన్ ఆవేశంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినారు.  ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకుండా రాష్ట్ర ఖజానాను మీ జేబులో డబ్బులాగ పిచ్చిపిచ్చిగా ఖర్చుచేస్తే తోలు తీస్తాం అని చెప్పడానికే కవాతుకు ఇన్ని లక్షల మంది వచ్చారు. చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యక్తులు మీరే అతిక్రమిస్తే ఎలా. మీరు చట్టాలు అతిక్రమించేటప్పుడు పేదల మీద అవే చట్టాల్ని ప్రయోగించే హక్కు ముఖ్యమంత్రికి, మంత్రులకు లేదు."


పవన్ నువ్వు కానిస్టేబుల్ కొడుకువా... మరీ కోట్ల రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నావు...!

ఇలా చంద్రబాబు, మంత్రులపై ఘాటు విమర్శలు చేశారు పవన్. బాబు చేసిన పునరంకిత సభలు, ధర్మపోరాట దీక్షల్ని దృష్టిలో పెట్టుకొని పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ కామెంట్స్ చేశారు పవన్. కవాతుకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూనే, ఇన్ని లక్షల మంది ఎందుకొచ్చారో అర్థం చేసుకోవాలని చంద్రబాబుకి సూచించారు జనసేనాని.

పవన్ నువ్వు కానిస్టేబుల్ కొడుకువా... మరీ కోట్ల రెమ్యూనరేషన్ ఎలా తీసుకున్నావు...!

"ఇన్ని లక్షలమంది ఊరికే రోడ్లపైకి రాలేదు. ఇన్ని లక్షల మంది సరదా కోసం రాలేదు. పనిలేక రాలేదు. నేనేమైనా వాళ్లకు డబ్బులిస్తానా, సారా ప్యాకెట్ ఇస్తానా. ఇంతమంది ఎందుకొచ్చారో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. సరిహద్దుల్లో ఆగిపోయిన ప్రజలతో కలిపి 10 లక్షల మంది వచ్చారంటే ఎందుకో అర్థంచేసుకోవాలి. వీళ్లంతా మార్పుకోసం వచ్చారు. దోచేసుకుంటున్న నేతల తోలు తీయడానికి వచ్చారు. ఖబడ్దార్, పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఊరుకోరు." అని ఘాటుగా స్పందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: