తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఇది షాకింగ్ న్యూసే. రాజకీయాల్లో ఆరోపణలు ఎంత సహజమో ఒక్కోసారి అవి నమ్మేలాగా ఉంటే అంత భయంకరం కూడా. ఇన్నాళ్ళూ వాళ్ళూ వీళ్ళూ అంటున్న మాటలను ఇపుడు ఓ ఎమ్మెల్యే నోటి వెంట రావడంతో జడుసుకోవడం టీడీపీ తమ్ముళ్ళ వంతవుతోంది. 


యాభై కోట్లు...మంత్రి పదవి :


చంద్రబాబు ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేనను ఆకర్ష్ మంత్రంలో వేటాడుతున్నాడనడానికి మరో ఉదంతం బయటపడింది. కర్నూల్ జిల్లా అలూర్ ఎమ్మెల్యే జయరాం లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ బాబు మీద పెద్ద బాంబే వేసారు. తనను వైసీపీ విడిచి టీడీపీలోకి రమ్మని రాయబేరాలు నడిపారంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అలా కనుక తాను వస్తే యాభై కోట్లతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని బాబు చెప్పరని జయరాం గుట్టు విప్పేశారు.


అలాగే కొన్నారట:


దీంతో తనకు ఓ విషయం అర్ధమైందని ఇంతకు ముందు తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను బాబు ఇలాగే కొన్నారన్న నిజం ఈ రాయబేరాల వల్ల తెలిసిందని చెప్పుకొచ్చరు. తాను మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా పార్టీ మారేది లేనేలేదని జయరాం క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు, తాను జగన్ పక్కన వైసీపీ నీడన ఉంటానని కూడా వెల్లడించారు.


ఇకరకాటమే :


ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ ఓ ఎమ్మెల్యే ఇలా కోట్ల భాగోతం గుట్టు రట్టు చేయడం టీడీపీకి ఇరకాటమేనని అంటున్నారు. కాదు పొమ్మన్న జనం మాత్రం ఏ లావాదేవీలు లేకుండా ఎమ్మెల్యేలు పార్టీ మారరని ఇప్పటికే అనుకుంటున్నారు. దానికి జయరాం తాజా వ్యాఖలు నిజం చేశాయి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: