దివంగత జయలలిత మరణం తో తమిళ రాజకీయాలు అతలాకుతలమైన క్రమంలో రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సంచలనం సృష్టించారు సూపర్ స్టార్ రజనీకాంత్. అయితే ఇప్పటి వరకు తన రాజకీయ పార్టీ పేరు గురించి గానీ మరి ఏ ఇతర విషయాల గురించి గానీ సరైన స్పష్టత ఇవ్వలేదు రజిని.
ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేయకముందే పార్టీ పేరు ప్రకటించకముందే రజినీకాంత్ పై అవినీతి ఆరోపణలు తమిళ రాజకీయాల్లో వినబడుతున్నాయి….ముఖ్యంగా రజిని పార్టీ పేరు మక్కల్ మండ్రమ్ అంటూ తమిళనాట ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా పార్టీపై పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
మక్కల్ మండ్రమ్ పార్టీలో డబ్బులన్న వారికే పదవులు దక్కుతాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. సంపన్నులకే రజనీకాంత్ పార్టీలో పదవులు దక్కుతాయంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా, ఈ విమర్శలపై రజనీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను కేవలం రాజకీయాల్లోకి వచ్చే మార్పు కోసమే అంటూ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలను గురించి పట్టించుకునే సమయం నాకు లేదని..
కేవలం తాను పెట్టబోయే పార్టీ లో స్వచ్ఛమైన రాజకీయాలు చేసే వారిని తీసుకుంటానని..డబ్బులు పదవులు ఆశించి వచ్చేవారు నా పార్టీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదని కరాఖండీగా తేల్చేశారు. అంతేకాకుండా తాను స్థాపించబోయే పార్టీ పేరు త్వరలో ప్రకటిస్తానని..పార్టీ సిద్ధాంతాలు గురించి అన్ని విషయాలు త్వరలో తెలియజేస్తాం అని స్పష్టత ఇచ్చారు రజనీకాంత్.