తెలుగు సినిమా రంగానికి చెందిన మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు తెగ పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు కలిగిన మంచు ఫ్యామిలీ గతంలో మోహన్ బాబు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసినదే.
ఈ క్రమంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంచు మనోజ్ ..జనసేన పార్టీలోకి వస్తున్నట్లు ఏపీ పాలిటిక్స్ లో వార్తలు వినపడుతున్నాయి. ఇదే క్రమంలో మోహన్ బాబు కూడా ఎప్పటి నుంచో తాను త్వరలోనే ఓ రాజకీయ పార్టీలో చేరతానని ప్రకటించారు.జగన్ కుటుంబంతో ఉన్న బంధం మేరకు వైఎస్ఆర్ సీపీ పార్టీలో జాయిన్ అవుతారని భావించారు.
అయితే గత కాలంగా సినిమాకు దూరంగా ఉంటున్న మనోజ్ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.మనోజ్ అటు టీడీపీ ,ఇటు వైసీపీ పార్టీలు కాకుండా నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఇటీవల తన ట్విట్టర్ ఎకౌంట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు వారి కుటుంబాలకు ఏదైనా తన వంతుగా మంచి చేయాలని దానికోసం సరైన మార్గం వెతుకుతున్నారని స్పష్టం చేయడం జరిగింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ తరఫున మంచు మనోజ్ పోటీ చేస్తున్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో టాక్ వినపడుతుంది.