జగన్ మీద జరిగిన దాడి అందరిని ఆశర్య పరిచింది. అయితే దాడి ఎందుకు జరిగిందన్న విషయం ఇంత వరకు ఎవరికి తెలియలేదు. దీని వెనుక రాజకీయ శక్తులు ఏమైనా ఉన్నాయా అని వైస్సార్సీపీ వారు అనుమానిస్తున్నారు.ఒకవైపు పరిమితంగా ఉన్న పోలీసు భద్రత, తనదంటూ సొంత భద్రతావలయం ఇవన్నీ ఉన్నా కూడా.. ఒక వ్యక్తి.. అత్యంత పటిష్టమైన భద్రతా వలయం మధ్యలో ఉండే ఎయిర్ పోర్ట్ లోనే.. ఒక వ్యక్తి జగన్ మీద కత్తితో దాడి చేశాడంటే.. ఆయన భద్రత పరిస్థితి ఎంత డొల్లగా ఉన్నదో అర్థమవుతోంది.


సింపుల్ గా చెప్పాలంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు గాలిలో ఉన్నాయి! అవును సరిగ్గా ఈ వార్త రాస్తున్న సమయానికి వైఎస్ జగన్ ప్రాణాలు గాలిలోనే ఉన్నాయి. కత్తితో దాడికి గురైన ఆయన స్వల్ప ప్రథమ చికిత్స చేయించుకుని విశాఖ ఎయిర్ పోర్ట్ లో విమానం ఎక్కేసి, హైదరాబాదు వస్తున్నారు. ఇంకా హైదరాబాదు చేరుకోలేదు. రోజా వంటి నాయకురాలు ఆ కత్తికి ఏదైనా విషంపూసి పొడిచారేమో అని అనుమానం వ్యక్తంచేస్తున్న తరుణంలో.. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి .. విమానంలో ఎలా ఉన్నదో ఏమో.. ఆయన ప్రాణాలు భద్రంగానే ఉన్నాయో లేదో అనే భయాలు అభిమానులకు కలుగుతున్నాయి.


ఈ ఒక్క సందర్భం కాకపోయినా కూడా.. జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు గాలిలోనే ఉన్నాయని అనుకోవాలి. ఎందుకంటే.. జగన్ విపరీతంగా ప్రజల మధ్య తిరుగుతుంటారు. గత 300 రోజులుగా ఆయన పాదయాత్రలోనే ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని లక్షలమంది  ప్రజలతో ఆయన అతి సన్నిహితంగా మెలగుతున్నారు. తనను ఎవరు కలవడానికి వచ్చినా.. తన వద్దకు ఎవరు రాదలచుకున్నా.. తనతో సెల్పీలు దిగాలనుకున్నా.. ఆయన సహకరిస్తున్నారు.

ఒక రకంగా చెప్పాలంటే భద్రతా వలయం ఆంక్షలను కూడా ఆయన లెక్క చేయడంలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: