విశాఖటపట్నం విమానాశ్రయంలో జగన్ పై కత్తితో జరిగిన దాడిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పై ఓ పిల్లకుంక జరిపిన దాడిని చాలా పెద్దదిగా చిత్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. నిజంగానే తాము గనుక దాడి చేయాలనుకుంటే వేసిన ప్లాన్ మిస్పవదంటూ చెప్పటం గమనార్హం. పిల్ల కుంకలతో తాము ప్లాన్ చేయమని చెప్పటం విడ్డూరంగా ఉంది. జగన్ ను హత్య చేయాలని చంద్రబాబునాయుడు అనుకుంటే పిల్లకుంకలతో ప్లాన్ చేస్తాడా అంటూ ఎదురుప్రశ్నించటం విచిత్రంగా ఉంది.

 

తాము గనుక నిజంగానే ప్లాన్ చేస్తే ఇలా గుచ్చుకోవటాలు గిచ్చుకోవటాలు ఉండవన్నారు. ప్లాన్ చేయాలనుకుంటే వైఎస్ రాజరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ ప్లాన్ తరహాలోనే  ఉంటుందని చెప్పటం గమనార్హం. కానీ అలా ఆలోచన చేసే పద్దతి తమది కాదని కాబట్టి జగన్ పై జరిగిన దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చేశారు.  జగన్ కు అయిన అరసెంటిమీటర్ గాయానికి గవర్నర్ విచారణ చేయాలా అంటూ ఎదురు ప్రశ్నించటం ఆశ్చర్యంగా ఉంది.


అసలు ఒక గవర్నర్ 12 ఏళ్ళు ఓకే చోట ఉన్న సందర్భం ఉందా అంటూ నిలదీయటం ఆశ్చర్యంగా ఉంది. జగన్ దాడి విషయాన్ని గవర్నర్ ఆరాతీయటానికి, 12 ఏళ్ళుగా గవర్నర్ గా ఉండటానికి ఏమన్నా సంబంధం ఉందా ? అన్నదే ప్రశ్న. ఇలాంటి మతిలేని మాటలు మాట్లాడిరందుకే చంద్రబాబుపై అందరూ మండిపడుతున్నారు. చంద్రబాబు దారిలోనే మంత్రులు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. నరసింహన్ పై కేంద్రానికి ఎందుకింత ప్రేమ అంటూ నిలదీశారు. గవర్నర్ కు కేంద్రానికి సంబంధించిన విషయంలో సోమిరెడ్డి దూరటం ఏంటో అర్ధం కావటం లేదు.


దాడి జరిగింది విమానాశ్రయంలో అయితే వైసిపి నేతలు కేంద్రప్రభుత్వాన్ని ఒక్క మాటకూడా మాట్లాడటం లేదంటూ పెద్ద లాజిక్ లేవదీశారు. జగన్ పై దాడి చేసింది టిడిపి నేత క్యాంటిన్లో పనిచేసే కుర్రాడని, టిడిపి మద్దతుదారుడని వైసిపి నేతలు ధృవీకరించుకున్నారు కనుకే చంద్రబాబుపై మండిపడుతున్నారు. దాడి జరగటం విమానాశ్రయంలోనే అయినా చేసింది టిడిపి మద్దతుదారుడు కాబట్టే చంద్రబాబును అందరూ టార్గెట్ చేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: