ఇప్పడూ రాష్ట్ర రాజకీయాలు గరుడ ఆపరేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. శివాజీ చెప్పిన గరుడ పురాణం టీడీపీ వారు బాగా వాడుకుంటున్నారు. అయితే ఈ గరుడ పురాణం గురించి పోసాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. శివాజీ చెప్పినట్టుగానే ‘ఆపరేషన్ గరుడ’ భాగంగానే జగన్‌పై దాడి జరిగిందని దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ వర్గాలు శివాజీ గరుడకు ప్రచారం కల్పించాయి.
Image result for jr ntr
జగన్‌పై దాడి విషయాన్ని పక్కన పెడితే.. అసలు ఈ ఆపరేషన్ గురుడ ఏమిటన్న పరేషాన్‌లో జనాన్ని పడేశారు పొలిటికల్ లీడర్స్. అప్పట్లో గరుడ లేదూ వడ, పెరుగూ లేదంటూ తీసిపారేసిన నేతలు.. ఇప్పుడు శివాజీ ‘ఆపరేషన్ గరుడ’కు జగన్‌పై దాడి నేపథ్యంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో సినీ నటుడు, రచయిత, పొలిటీషియన్ పోసాని క్రిష్ణమురళి ‘ఆపరేషన్ వెర్రి పువ్వు’ అనే కొత్త ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. 
Image result for posaani murali krishna
ఈ ఆపరేషన్‌ పప్పులో కీలక అంశం ఏంటంటే.. జగన్ ఉంటే జైలులో ఉండాలా? లేక ఈ భూమ్మీద ఉండకూడదు అనేది ముఖ్యం. నటుడు శివాజీకి ‘ఆపరేషన్ గరుడ’కు సోర్స్ ఎలా వచ్చాయో నాక్కూడా ఢిల్లీ నుండి సోర్స్ వచ్చాయి. పప్పు అంటే నాకు ఎవరో తెలియదు. ఆయన నాకు ఫోన్ చేసి ఆంధ్రరాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న ప్రముఖ నాయకులు ఇందులో ఉన్నారు అన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే.. మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్‌ పాపులారిటీని తగ్గించడం.. ఆయన్ని గత ఎన్నికల్లో మాదిరే మోసం చేయడం. రెండోది ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా వద్దు అని ఏ నోటితో చెప్పారో.. అదే నోటితో ప్రత్యేక హోదా కావాలి అని జనాన్ని నమ్మించడం. 

మరింత సమాచారం తెలుసుకోండి: