తెలుగుదేశంపార్టీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికన్నా అర్ధమవుతోందో లేదో అనుమానంగా ఉంది. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి అన్నా, వైసిపి అన్నా చంద్రబాబునాయుడు దగ్గర నుండి టిడిపిలో క్రిందస్ధాయి నేతల వరకూ రెచ్చిపోతుండటం అందరూ చూస్తున్నదే. రాష్ట్రంలో ఎక్కడేమి జరిగినా, జరగకపోయినా మొత్తాన్ని జగన్ కే ఆపాదించి వికృతానందం పొందుతుంటారు. అందులో భాగంగానే తాజాగా విజయవాడ ఎంపి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

 

కేశినేని మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశంపార్టీ తలచుకునుంటే జగన్ ఎప్పుడో కైమా కైమా అయిపోయుండేవారని మండిపడ్డారు. పాదయాత్రలో 3 వేల కిలోమీటర్లు తిరిగినపుడు జరగని దాడి విమానాశ్రయంలో అందులోనూ సిఐఎస్ఎఫ్ సెక్యురిటీ ఉండే విమానాశ్రయంలోనే ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. సిఐఎస్ఎఫ్ భద్రతలో ఉండే విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగింది కాబట్టి కేంద్రమే బాధ్యత వహించాలని తేల్చేశారు.

 

మొన్నిటకిమొన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ పై దాడి విషయాన్ని ప్రస్తావిస్తు టిడిపి నిజంగానే దాడి ప్లాన్ చేస్తే ఇలాగుండదన్నారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ప్లాన్ చేసినట్లే చేస్తామన్నారు. ఈ గిచ్చుళ్ళు, గుచ్చుళ్ళు ఉండని చెప్పారు. తాము ప్లాన్ చేస్తే ఫెయిల్ అవటం ఉండదన్నట్లు చెప్పారు. జగన్ పై హత్యాయత్నమని వైసిపి అంటోంది. కాదు అంతా డ్రామానే అని ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. రెండింటిలో ఏది నిజమో తేలాలంటే కొద్ది రోజులు టిడిపినే సంయమనం పాటించాలి. ఎదుకుంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. అటువంటిది ఎదురుడాడితో మంత్రులు, ఎంపిలే రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడటమేంటో అర్ధం కావటం లేదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: