జగన్ మీద జరిగిన దాడి వైసీపీ నాయకులూ కు మరియు కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది అయితే ఎక్కడ కూడా ఎటువంటి హింసా పనులు చేయకుండా సంయమనం పాటించారు.  ముసలి వయసులో అధినేత తనువు చాలించినా రోడ్లపైకి వచ్చి నానా రచ్చ చేసే అభిమానుల్నీ చూశాం. కానీ హత్యాయత్నం నుంచి జగన్ తృటిలో తప్పించుకున్నాడన్న వార్త నిమిషాల్లో దావానలంలా వ్యాపించినా వైసీపీ నేతలు మాత్రం సంయమనంతో ఉన్నారు. వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసింది టీడీపీ. ఈ మేరకు కొందరు మంత్రులకు, అనుకూల మీడియాకు బాబు సూచనలు కూడా చేశారు.

Image result for chandrababu

కానీ బాబు జిత్తులు, అతని అను'కుల'మీడియా ఉచ్చులో వైసీపీ శ్రేణులు పడలేదు. ఈ విషయంలో ప్రతిపక్ష నేతలు చాలా హుందాగా ప్రవర్తించారు. ఇప్పటికే ఫ్యాక్షన్ రాజకీయాలంటూ వైసీపీని టార్గెట్ చేసింది టీడీపీ. జనసేనాని కూడా గోదావరి యాత్రలో ఫ్యాక్షన్ అంటూ రొచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మీడియా కూడా జగన్ పై దాడి జరిగిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నేతలు చేస్తున్న నిరసన కార్యక్రమాలపై ఓ కన్నేశాయి. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరిగినా దాన్ని బూతద్ధంలో చూపించడానికి రెడీ అయింది. అయితే వారి ఆశలు ఫలించలేదు.

Image result for jagan

తొలిరోజు రాజ్యాంగబద్దంగా నిరసన చేపట్టిన నేతలు, మలిరోజు ప్రార్థనలతో ముగించారు. జగన్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. దాడి జరిగిన తర్వాత జగన్ ట్విట్టర్ లో స్పందించిన తీరు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇదే దాడి వేరేవారిపై జరిగి ఉంటే పరిస్థితి ఊహించుకోడానికి కూడా కష్టం. జగన్ పై హత్యాయత్నంతో రాజకీయంగా లబ్దిపొందాలని చూసిన టీడీపీకి ఇది ఊహించని షాక్. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పటికీ జగన్ సూచనల మేరకు వైసీపీ శ్రేణులు సంయమనం కోల్పోకపోవడం వారి పరిపక్వతకు నిదర్శనం. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకు అంతా ఆచితూచి వ్యవహరించారు. ఎవ్వరూ ఎక్కడా రెచ్చిపోలేదు. 2014కి 2019 ఎన్నికల నాటికి వైసీపీ నేతలు, శ్రేణుల్లో ఎంత పరిణతి వచ్చిందో చెప్పడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ.

మరింత సమాచారం తెలుసుకోండి: