ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ పట్నం విమానాశ్రయంలో ఒక యువకుడు కత్తితో దాడి చేశాడు. విమానాశ్రయంలోని క్యాంటీన్ లో పని చేస్తున్న ఆ యువకుడు కోడి పందేల్లో ఉపయోగించే కత్తిని ఉపయోగించి జగన్ పై దాడి చేశాడు. ముందు ఆ కుర్రాడు టీ ఇచ్చాడనీ, తర్వాత సెల్ఫీ తీసుకునే నెపంతో ఆయన దగ్గరకు వచ్చి… దాడికి పాల్పడ్డాడు. అయితే అప్రమత్తమైన జగన్ వ్యక్తిగత సిబ్బంది దాడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే జగన్ మోహన్ రెడ్డిపై హత్యా యత్నానికి పాల్పడిన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
జగన్ పై హత్యా యత్నంపై రాజకీయం వేడేక్కి పోయింది. ప్రథమ చికిత్స అనంతరం ఆయన హైదరాబాద్ కు బయల్దేరారు. విశాఖ ఎయిర్ పోర్టు క్యాంటీన్ లో పని చేస్తున్న ఆ వెయిటర్ ఎందుకు దాడి చేశాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారం రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు.
జగన్ నివాసం లోటస్ పాండ్ లో జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్లడ్ శాంపుల్స్ నివేదిక వచ్చిందని వైద్యులు తెలిపారు. జగన్ రక్త నమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కోడి కాలికి కట్టే కత్తి కావడంతో దానికి విషం పూశారేమోననే అనుమానంతో జగన్ బ్లడ్ శాంపుల్స్ను సేకరించి డాక్టర్లు ల్యాబ్కు పంపిన విషయమూ విదితమే.