జగన్ మీద జరిగిన దాడిని టీడీపీ కేంద్రం మీదకు నెట్టేసి చేతులు దులుపు కుందామని ప్రయత్నిస్తుంది. ఇంకొక అడుగు ముందుకేసి ఆ దాడిని జగన్ చేయించుకున్నాడని ప్రచారం చేసే స్థాయికి దిగజారి పోయింది. మరీ జగన్ ఆ పని చేయిస్తే విచారణ చేయించి నిజాలను నిగ్గు తేల్చే ధైర్యం టీడీపీ ఎందుకు చేయడం లేదు. ఇందులో మంత్రి నారా లోకేష్ బాబు.. జగన్ తన మీద తను ఈ దాడి చేయించుకున్నాడు అని అన్నట్టుగా ట్వీటేస్తున్నాడు. అయితే అందులో కూడా స్పష్టత లేదు. దొరికిన దొంగ జగన్ మోదీ రెడ్డి అంట! మరి ఇంకేం.. అదే జరిగి ఉంటే.. అలాగే ఒక నివేదికను తయారు చేసి ఇవ్వొచ్చుగా?

కూతలెందుకు లోకేషూ.. కుట్రలు బయటపెట్టు!

జగన్ తన మీద తనే ఈ దాడి చేయించుకుని ఉంటే.. తెలుగుదేశం పార్టీకి ఇంతకన్నా అవకాశం లేదు. ఈ విషయాన్ని పూర్తి ఆధారాలతో చూపించేసి వైసీపీ అధినేతను పూర్తిగా ఇరకాటంలో పెట్టొచ్చు. అయితే ఈ మేరకు కూతలైతే కూస్తున్నారు.. తోచినట్టుగా మాట్లాడుతున్నారు.. కానీ ఆ కుట్ర కోణం ఏమిటో మాత్రం చెప్పడం లేదు. ఒకవేళ జగన్ ఇలాంటి పని చేయించుకుని ఉంటే.. తెలుగుదేశం పార్టీ ఇంత సేపూ ఇలా కూర్చుని ఉండేది కాదు.

Image result for jagan

విచారణ కమిటీని ఏర్పాటు చేసేది. అయితే అంత ధైర్యం ఎందుకు చేయడం లేదు? ఈ వ్యవహారంపై ఎందుకు ఈ రాద్ధాంతం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందనే అనుకున్నా.. దాన్నైనా బయట పెట్టొచ్చు కదా? అధికారం తెలుగుదేశం చేతిలోనే కదా ఉంది? ఈ వ్యవహారంపై స్పందించకుండా చంద్రబాబు నాయుడు గవర్నర్ వ్యవస్థపై రాజకీయం ఎందుకు మొదలుపెడుతున్నాడు? గవర్నర్ ఒక్క ఫోన్ కాల్ చేయడమే తప్పు అయిపోయిందా? ఇప్పుడు ఇంతకీ ఇక్కడ జరిగింది ఏమిటి? చంద్రబాబు మాట్లాడుతున్నది ఏమిటి? లోకేషేమో జగన్ మీద జగనే దాడి చేయించుకున్నాడని అంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: