జగన్ దాడి గురించి నమ్మలేని నిజాలు బయట పడుతున్నాయి. నిందితుడు జగన్ ను హత మార్చడానికే వచ్చాడని పోలీసులకు అర్ధం అవుతుంది. నిజంగా అదే కత్తి కనుక గొంతు లో దిగి ఉంటే ఘోరం జరిగి ఉండేదని తెలుస్తుంది. అయితే టీడీపీ ఇది చిన్న గాయమే అని ఇప్పటివరకు కుటీల రాజకీయాలు చేసింది. ఈ పోలీస్ రిపోర్ట్ తో టీడీపీ నాయకులు మొహం ఎక్కడ పెట్టుకుంటున్నారని చాలా మంది ఆరోపిస్తున్నారు.
అయితే తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఈ రోజు బయట పెట్టినటువంటి రిపోర్టులో వచినటువంటి కొన్ని సాక్ష్యాలు ఇప్పడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేసే విధంగా ఉన్నాయి. పోలీసుల యొక్క రిపోర్టు ప్రకారం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నట్టుగా జగన్ కు తగిలింది చిన్న గాయం కాదని,దాదాపు మూడు ఇంచుల లోతుకు ఆ కత్తి దిగిందని తెలిపారు,అంతే కాకుండా అదే కత్తి వేటు గాని మెడ మీదనే గాని తగిలి ఉంటే జగన్ యొక్క ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు పొందుపరిచిన రిపోర్టులో తెలిపారు.
శ్రీనివాసు రావు తో పాటు అతనికి సహకరించినటువంటి మరో ముగ్గురును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది.కత్తి జగన్ యొక్క భుజానికి తగలడం అదృష్టమని, అదే మెడ మీద గాని తగిలితే పెద్ద ఘోరమే జరిగి ఉండేదని రిపోర్టులో తెలిపారు.ప్రభుత్వం ఈ చర్యను తక్కువ చెయ్యడానికి ప్రయత్నిస్తుందని,పోలీసు రేపోతూ ద్వారా అసలు నిజం ఏమిటో ప్రజలకు తెలిసిందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.