ఇటీవల జనసేన పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ ..పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తో కలిసి శ్రీకాకుళం జిల్లాలో తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి చాలా చురుగ్గా వ్యవహరించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి చెందిన నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరి తొలిసారిగా గుంటూరు జిల్లా తెనాలికి వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

Image result for nadendla manohar

ఈ సభలు ఏర్పాట్లు చూసిన నాదెండ్ల మనోహర్ ఒక్కసారిగా షాక్ తిన్నట్లు సమాచారం.ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల మనోహర్ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీపై మరియు అదే విధంగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ పై సంచలన కామెంట్ చేశారు.

Related image

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లక్నో వెళితే మీకేమిటి బాధ?' అని ప్రశ్నించారు. లక్నోవెళ్లిన తమపై అసత్య ప్రచారాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జనసేన అంటే అధికార, ప్రధాన ప్రతిపక్షానికి ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. మార్పు కోరుకుంటున్న జనసేన సిద్ధాంతాలు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నందువల్లే ఆ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.

Image result for nadendla manohar

రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అంటే ఏంటో రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి అర్థమయ్యేరీతిలో ఏపీ ప్రజలు తెలియజేస్తారని వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎక్కువ విజయవకాశాలు జనసేన పార్టీకి ఉన్నాయని స్పష్టం చేశారు. తిత్లీ తుపాన్‌ బాధితులను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని..ఈ విషయంలో గవర్నర్ త్వరగా స్పందించాలని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: