తాజాగా ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా విమానాశ్రయంలో జగన్ పై దాడి చేసిన వ్యక్తి శ్రీనివాస్ ఓ క్యాంటీన్ లో పనిచేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఆ క్యాంటీన్ నిర్వాహకుడు... యజమాని అయిన హర్షవర్ధన్ క్యాంటీన్ ఓపెనింగ్ ఫంక్షన్ కి స్వయంగా మంత్రి నారా లోకేష్ ని ముఖ్యఅతిథిగా పిలిచినట్లు సమాచారం.
పక్క ప్లానింగ్ తోనే జగన్ని హతమార్చాలని తెలుగుదేశం పార్టీ వ్యవహరించిందని తాజా పరిస్థితుల బట్టి అర్థమైపోతుంది అని చాలామంది నేతలు అంటున్నారు. ముఖ్యంగా విమానాశ్రయంలో జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో..ఆరు నెలల క్రితం విమాన శాఖ మంత్రిగా ఉన్న నాయకుడు ఎవరో చంద్రబాబు మర్చిపోయాడా ఏపీ ప్రజలు మర్చిపోయారా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.
సదరు నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు క్యాంటీన్ వాన హర్షవర్ధన్ వ్యాపార కాంట్రాక్ట్ విమానాశ్రయంలో తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేశారు. ఆ నాటి నుంచే జగన్ని హతమార్చాలనుకున్న ప్రత్యర్థులు కూడా వ్యూహరచన చేశారా? గరుడ పురాణాలు వినిపించిన టైం కూడా అదే.
మొత్తంగా వాళ్ళే వ్యూహ రచన చేసి……..వాళ్ళే వ్యూహాన్ని అమలు చేసి…….అంతా కూడా గరుడ పురాణం అకౌంట్లో వేస్తూ కేంద్రాన్ని బాధ్యులను చేయాలని చూశారా? ఈ ప్రశ్నలను లోతుగా ఆలోచిస్తే హత్యా రాజకీయం మిస్టరీ ఎవ్వరికైనా ఈజీగానే అర్థమవుతుంది అని అంటున్నారు రాష్ట్రంలో చాలామంది.