విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన శ్రీనివాస్ అచ్చంగా తెలుగుదేశంపార్టీ మద్దతుదారుడేనా ? అందుకు తాజాగా ఓ సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. మొన్న 25వ తేదీన హత్యయత్నం జరిగిన దగ్గర నుండి నిందితుడు టిడిపి మద్దతుదారుడే అని వైసిపి నేతలు అంటున్నారు. కాదు హత్యాయత్నమంతా కేవలం డ్రామానే అని నిందితుడు జగన్ అభిమానే అంటూ టిడిపి ఎదురుదాడికి దిగింది. జరిగిన ఘటనను వదిలిపెట్టి దాడి చేసిన యువకుడు ఎవరు అనే విషయంలో రాజకీయం మొదలైంది.

 

సరే ఎవరి వాదనకు తగ్గట్లుగా వాళ్ళు తమ వాదనను వినిపించటంతో మొత్తం గందరగోళంగా తయారైంది. టిడిపి తమ వాదనకు మద్దతుగా ఓ ఫ్లెక్సీని, నిందితుడి జేబులో లేఖలున్నాయంటూ ఏవేవో బయటపెట్టింది. వాటన్నింటినీ బోగస్ సాక్ష్యాలుగా వైసిపి కొట్టిపారేసింది. సాక్ష్యాలన్నింటినీ టిడిపి నేతలే సృష్టించారన్న విషయాన్ని వైసిపి నేతలు తేల్చేశారు. అదే సమయంలో శ్రీనివాస్ టిడిపి మద్దతుదారుడే అనేందుకు గట్టి సాక్ష్యాన్ని చూపలేకపోయారు.

 

ఇటువంటి నేపధ్యంలో శ్రీనివాస్ టిడిపి మద్దతుదారుడే అనేందుకు తాజాగా వైసిపి గట్టి సాక్ష్యాన్ని బటయపెట్టింది. అదేమిటంటే, శ్రీనివాస్ టిడిపి గుర్తింపుకార్డును వెలుగులోకి తెచ్చింది, 2016-18 సంవత్సరాలకు గాను శ్రీనివాస్ తీసుకున్న టిడిపి గుర్తింకార్డు బయటపడింది. దానిపై చంద్రబాబు నాయుడు సంతకంతో పాటు ఎన్టీయార్ బొమ్మకూడా స్పష్టంగా కనబడుతోంది. ఇక, విశాఖపట్నంలో జగన్ పై జరిగింది హత్యాయత్నమే అని పోలీసులు కోర్టుకు సమర్సించిన రిమాండ్ రిపోర్టులో కూడా స్పష్టంగా అంగీకరించారు. దాంతో చంద్రబాబు చెబుతున్నదంతా అబద్దమే అని తేలిపోయింది,


మరింత సమాచారం తెలుసుకోండి: