జగన్ దాడి గురించి టీడీపీ నేతలు మాటలు మరీ దారుణంగా ఉన్నాయి. ప్రజలు వారి మాటలు ఈసడించుకునే స్థాయికి వచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు ప్రజలు టీడీపీ గురించి ఏమనుకుంటున్నారని.. వీరి దారుణమైన మాటలు  ఎలా ఉన్నాయంటే టీడీపీలో ఓ పెద్దమనిషి.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి జగన్‌ కుటుంబ సభ్యుల మీదనే తీవ్ర ఆరోపణలు చేసేశాడు. చట్ట సభలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పెద్దాయన జగన్‌ తల్లి, జగన్‌ సోదరి మీద ఆరోపణలు చేయడం వివాదాస్పదమయ్యింది. సొంత పార్టీ నేతలే కొందరు ఈ ఆరోపణల్ని ఖండించేస్తుండడం గమనార్హమిక్కడ. 'నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది..' అంటూ అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత, తమ పార్టీకే చెందిన ఆ పెద్ద మనిషికి మీడియా సాక్షిగా క్లాస్‌ తీసుకోవాల్సి వచ్చింది.

వెన్నుపోటు.. చంద్రబాబునే అడుగు బాబూ.!

ఇంతకీ, ఎవరా పెద్దమనిషి.? పరిచయం అక్కర్లేని వ్యక్తి.. నోటి దురదకి కేరాఫ్‌ అడ్రస్‌.. ఆయనే, బాబూ రాజేంద్రప్రసాద్‌. నోటికొచ్చింది వాగడం ఆయన ప్రత్యేకత. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు చెప్పింది చేయడం తప్ప, తనకంటూ ఓ ఆలోచన లేని వ్యక్తిగా ఈయన గురించి చెప్పుకోవచ్చు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విషయమై ఎలా మాట్లాడాలో తెలియక తికమకపడుతున్న టీడీపీ నుంచి, మరో 'దురదృష్టకరమైన' ఆరోపణ తెరపైకొచ్చింది.

Image result for jagan

పార్టీలో వైఎస్‌ జగన్‌ తన సోదరికీ, తల్లికీ తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనీ, అందుకే పార్టీపై పట్టుకోసం జగన్‌ని అంతమొందించాలని విజయమ్మ, షర్మిల స్కెచ్‌ వేశారంటూ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఆరోపించేశారు. అవునా.? ఇలాంటి కుట్రలు చంద్రబాబుకి తప్ప, బహుశా దేశ రాజకీయాల్లో ఇంకెవరికీ సాధ్యంకావేమో. పార్టీ పగ్గాలు దక్కించుకోవడం కోసం పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు. ప్రపంచ రాజకీయ డిక్షనరీలో వెన్నుపోటు.. అనగానే, ముందుగా గుర్తుకొచ్చే పేరు చంద్రబాబుదే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: