చంద్ర బాబు కు తెలుగు లో ఉన్న చాలా చానెల్స్ టీడీపీ కి డబ్బా కొట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారని చాలా మందికి తెలిసిందే. అయితే జగన్ మీద హత్యాయత్నం విషయంలో టీడీపీ ఎన్ని రకాలుగా మాట్లాడుతోందో, టీడీపీ నేతలు ఎంత నీభమైన మాటలు మాట్లాడుతున్నారో.. ఈ విషయంపై కదిలిస్తే వారిలో ఎంత అసహనం బయటపడుతోందో వారి మాటలే అర్థమయ్యేలా చేస్తూ ఉన్నాయి.


జగన్ తో అందుకే మాట్లాడలేదు ... చాలా భాద పడ్డాను చంద్ర బాబు స్పష్టీకరణ...!

టీడీపీకి ఉన్న నోరు.. ఆ పార్టీకి ఉన్న మీడియా బలం.. ఇప్పుడు చిన్నబోతోంది. ఏ వ్యవహారంలో అయినా ఎదురుదాడి చేసేసి.. కిందపడ్డా పైచేయి తమదే అనే శక్తి టీడీపీకి ఉంది. జగన్ మీద అటాక్ విషయంలో కూడా టీడీపీ ఇదే వ్యూహాన్ని అవలంభించింది. అవలభిస్తోంది. అయితే.. ఈసారి వారి తీరు వర్కవుట్ కావడంలేదు. ఈ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం నికార్సైన విచారణకు వెనుకడుగు వేస్తోంది. ఎంతసేపూ దీన్ని అంతా మరిచిపోయేలా చేయాలనే ఆరాటమే తప్ప మరో ప్రయత్నం కనిపించడం లేదు. అలా కదాని ఎవరైనా ఈ అంశం మీద కదిలిస్తే.. టీడీపీ వాళ్ల అసహనం బయపడుతూ ఉంది.


జగన్ తో అందుకే మాట్లాడలేదు ... చాలా భాద పడ్డాను చంద్ర బాబు స్పష్టీకరణ...!

ఇక చంద్రబాబు, లోకేష్ లు ఇప్పుడు సాక్షి పేరును కూడా ప్రస్తావనలోకి తెస్తున్నారు. సొంత పేపర్ పెట్టుకుని ఏదేదో రాసేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. అయినా మీడియాను గాట్లో కట్టేసుకోవడం.. దాన్ని ఉపయోగించుకోవడం గురించి వీళ్లేమాట్లాడాలి. రెండు పత్రికలు.. పదికి పైగా చానళ్లు అనుకూలంగా పనిచేస్తున్నా.. ఈ వ్యవహారంలో కూడా యథాశక్తిన టీడీపీకి సహకారం అందిస్తున్నా.. చంద్రబాబుకు మాత్రం మళ్లీ సాక్షి మీద అసహనం కలుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: