ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై దాడి జరుగుతుందని ముందే చెప్పిన ఆపరేషన్ గరుడ యాక్టర్ శివాజీ పై వైసీపీ నేతలు ఇష్టమొచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో శివాజీ స్పందించారు. జగన్ పై హత్యాయత్నం జరగక ముందు రోజు అమెరికా వెళ్లిపోయిన శివాజీ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో..తాజాగా శివాజీ స్పందించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
ఈ నేపథ్యంలో అమెరికా నుండి హీరో శివాజీ మాట్లాడుతూ..ఆపరేషన్ గరుడ గురించి ఫస్ట్ తాను విన్నప్పుడు కూడా కామెడీగా ఉందని అనుకున్నానని, ఆ తర్వాత మొత్తం విషయం తెలిశాక నేను ఆ విషయాన్ని బయటపెట్టానని అయితే నన్ను అందరూ లైట్ తీసుకున్నారని శివాజీ అన్నారు.
ఇక ఏపీకి జరిగిన అన్యాయం పై ఒక్కడై పోరాడుతున్న చంద్రబాబు పోరాటాన్ని తాను ఆహ్వానిస్తున్నాని, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం చంద్రబాబు ఎంతో తపన పడుతున్నానని శివాజీ బహిరంగంగానే.. చంద్రబాబు పాలనను పొగుడు తున్నారు. ఇక తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తే వైసీపీకే నష్టమని శివాజీ అన్నారు.
అంతేకాకుండా 2019 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేన, జగన్ పార్టీలు కలిసి పోతాయని అన్నారు. అంతేకాకుండా తను చనిపోయేలోపు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అవుతానని షాకింగ్ స్టేట్మెంట్ ప్రకటించారు శివాజీ. దీంతో శివాజీ ఇచ్చిన స్టేట్ మెంట్ పై రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు.. హీరో శివాజీ వెనక తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.