ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం లో అక్టోబర్ 25 వ తారీఖున ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన హత్యాయత్నం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు యావద్దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా జగన్ పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అన్నది ఎప్పటి వరకు విచారణలో తేలలేదు. మరోపక్క వైసిపి టిడిపి పార్టీలో ఒకరిపై ఒకరు జగన్ దాడి విషయంలో దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు.

Image result for jagan attack knife

ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైయస్ జగన్ పై షాకింగ్ కామెంట్ చేశారు. అవి ఒకింత వెటకారంగాను ఒకింత వివాదాస్పదంగాను ఉన్నాయి.ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ వారు కోడి కత్తితో ఎంత డ్రామా చేశారో చూసారు కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Image result for jagan attack knife

ఇంకా జగన్ పై నానా మాటలు అన్నారు..సొంత పార్టీ కార్యకర్త తో వీరాభిమాని తో పొడిపించుకునే జగన్ సానుభూతి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కోడి కత్తి అంటూ ఎన్నికల ముందు కొత్త డ్రామాలు జగన్ మొదలు పెట్టారని విమర్శించారు.

Image result for chandrababu

అంతే కాకుండా తమిళనాడులో జల్లికట్టు నిరసన మాదిరి విశాఖ వచ్చి ప్రత్యేక హోదా కోసం డ్రామాలు ఆడారని,మరోపక్క అసెంబ్లీకి రాకుండా పోరాడలేక రాజీనామా చేసి పారిపోయారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ప్రజలు కూర్చోపెడితే ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నాయకుడు తనపై ఉన్న అవినీతి కేసులను మాఫీ చేసుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నారని జగన్ పై మండిపడ్డారు.




మరింత సమాచారం తెలుసుకోండి: