కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ప్రజలే చంద్రబాబుని గుడ్డలూడదీసి తంతారని ఒకప్పుడు టీడీపీ నేతలు వ్యాఖ్యానించిన విషయాన్ని, ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తు న్నారు. కొద్ది రోజుల క్రితం కూడా టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నాయనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఖండించారు. అంతేకాదు అలా చేస్తే ప్రజలు చంద్రబాబుని గుడ్డలూడదీసి కొడతారని పేర్కొన్నారు. ఇంకా ముందుకెళ్ళి కె ఈ కృష్ణమూర్తి ఏకంగా ఉరేసుకుంటానని అన్నారు
కాగా ఇప్పుడు నిజంగానే చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు రాహుల్ గాంధీని కూడా కలిశారు. అయితే అప్పుడు మంత్రులు మాట్లాడిన మాటలు ప్రజలు నిజం చేస్తారా? కె ఈ కృష్ణమూర్తి ఏకంగా ఉరేసుకుంటారా! ఆ మంత్రి పుంగవులు ఇప్పుడేమంటారని వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీది రక్తంతో కడిగిన హస్తమని ఒకప్పుడు చంద్రబాబే విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ రక్తపు చేతిలో చెయ్యి వేసి నడవడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని ఆరోపించారు.
"‘పదవుల కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారుతాడు. ఎంతటి నీచనికృష్ట రాజకీయాలు చేయడానికైనా సిద్దపడతారని మరోసారి రుజువైంది" అని ఎమ్యెల్సీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన విషయాన్ని మర్చిపోయారా? అని ఆయన చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తు న్నాయి. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి మీద హత్యాయత్నం మరో వైపు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు దోస్తీ ఈ రెండు పరిణామాల్లో కార్నర్ అవుతోంది తెలుగుదేశం.
ముందుగా జగన్ పై హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం మొదట ఎదురుదాడి చేసింది. ఆ అటాక్ పై తెలుగుదేశం పార్టీ స్పందన అనుమానాస్పదంగానే ఉంది. మొదటేమో అది జగన్ మీద జగనే చేయించుకున్న అటాక్ అని టీడీపీ అంది.ఆ పై అది బీజేపీ చేయించిన అటాక్ అంది. అయితే ఈ విషయంలో నిఖార్సైన విచారణ కు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీనిపై విచారణ చేయించే ఉద్దేశం కూడా లేదు.
చివరకు చంద్రబాబే చెప్పాడు అది జగన్ మీద జగన్ చేయించుకున్న అటాక్ కాదు అని. మరి అసలు కథ ఏమిటి? అంటే మాత్రం ఇప్పటి వరకూ దాన్ని బయటకు తీయడం లేదు. మరోవైపు ఈవ్యవహారంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గనుక హైకోర్టు విచారణకు ఆదేశిస్తే, అంతే సంగతులు. అప్పుడు టీడీపీ పాత్ర పూర్తిగా బయటకువచ్చే అవకాశం ఉంది.
ఇక కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని టీడీపీ ఏదో విధంగా సమర్థించుకుంటోందికానీ. ఈ విషయంలో విమర్శలు వాడీ వేడీగానే ఉన్నాయి. టీడీపీని ఇరకాటంలో పెడు తున్నాయి విమర్శలు. ఇలా రెండు రకాలుగా కార్నర్ అవుతోంది టీడీపీ. ఈ పరిణామాలు పార్టీపై జనాల్లో నమ్మకాన్ని చెరిపేసి తమను దెబ్బ కొడతాయేమో అని టీడీపీ శ్రేణు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి నిరసనగా రాజీనామా చేస్తున్నానని రామచంద్రయ్య ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడూ, చంద్రబాబుకు ఒక సిద్ధాంతం అనేది లేదని, ఆయన ఎవరితోనైనా కలుస్తారని విమర్శించారు. చంద్ర బాబు అవకాశ రాజకీయాలను తాము సమర్థించాల్సిన అవసరం ఏంటని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తా నన్న చంద్ర బాబుతో పొత్తు పెట్టుకోవడం దారుణమన్నారు.
చంద్రబాబుతో పొత్తు నైతికంగా టీడీపీకి ఊతమివ్వడం తప్ప, కాంగ్రెస్కు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఢిల్లీకి వచ్చి శాలువాలు కప్పి లడ్డూలు ఇస్తే చంద్ర బాబుకు లొంగు తారా? అని రాహుల్ గాంధిని ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చంద్రబాబు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతికి అంతు లేకుండా పోయిందని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో రాజ్యాంగ స్పూర్తిని దెబ్బదీశారన్నారు.
ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో అడ్డంగా దొరికిన చంద్రబాబుతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు పాపాలను భూజాన వేసుకోవాల్సిన ఖర్మ తనకు లేదన్నారు. మరోసారి అవినీతి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నానికి నిరసనగా రాజీనామా చేస్తున్నానని రామచంద్రయ్య పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదండ్ల మనోహర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. టీడీపీతో కాంగ్రెస్ కలుస్తుందన్న విషయం ముందే తెలుసుకుని ఆయన వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా తమ పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్న ‘సైకిల్’ పార్టీతో జట్టు కట్టడాన్ని ఆత్మహత్యా సదృశ్యంగా కాంగ్రెస్ నేతలు వర్ణిస్తున్నారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్ గురువారం రాజీనామా ప్రకటించారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాటాలు చేశామని, అలాంటి నాయకుడితో కలిసి పనిచేయడం ఇష్టంలేకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ఆయన తెలిపారు. టీడీపీతో చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తూ మరికొంత మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీని వీడుతున్నారు.
ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ దోస్తీ తో అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకి వచ్చేయ నున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది.గతం నుంచీ పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా బయటకి వచ్చేసే ఉద్దేశ్యం ఉండటం తోనే రెన్యువల్ విషయాన్ని పక్కకి నేట్టేసారని తెలుస్తోంది.