విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై ఎందుకు దాడి చేశాడు ఇప్పటి వరకు విచారణ చేపడుతున్న అధికారులకు తెలియజేయడం లేదు నిందితుడు శ్రీనివాస్. జగన్ పై దాడి విషయములో నిందితుడు శ్రీనివాసుని అన్ని విధాల అన్ని కోణాలలో ప్రశ్నించిన అతని నుండి సరైన సమాధానం రాకపోవడం తో విచారిస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు.


మరోపక్క వైసిపి టిడిపి నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆంధ్ర రాజకీయాన్ని రసవత్తరం గా మారుస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై దాడి విషయంలో చంద్రబాబు వెకిలి చేష్టలు చేస్తూ మీడియా ముందు వ్యవహరించిన తీరును తప్పు పట్టారు వైసీపీ పార్టీ కి చెందిన సీనియర్ నటుడు రచయిత అయిన పోసాని కృష్ణ మురళి.

Image result for lokesh chandrababu naidu

ఇటువంటి దాడి చంద్రబాబు కొడుకు మంత్రి నారా లోకేష్ విశాఖపట్టణం ఎయిర్పోర్టులో జరిగితే విషయం వేరేలా ఉండేది అని సంచలన కామెంట్ చేశారు. జగన్ మీద ప్రాణాపాయ స్థాయి దాడి జరిగితే అది కోడి కత్తి డ్రామా అని మాట్లాడుతారా..

Image result for lokesh posani

అదే జగన్ కు తగిలిన పోటే మీ కొడుకు లోకేష్ కు గాని తగిలి ఉంటే ఈ పాటికి అక్కడ ఎయిర్ పోర్ట్ ని చంద్రబాబు ఉంచేవాడా ఎప్పుడో లేపేసి ఉండేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతగల పదవిలో ఉండి ప్రతిపక్ష నేత పై దాడి జరిగితే రాజకీయ నాయకులు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు అంటూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: