అధికార పార్టీ టీడీపీలో టికెట్ల రగడ నానాటికీ పెరుగుతోంది. ఎవరికి వారే టికెట్ల రేసులో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పట్టు సాధించేందుకు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ప్రస్తుతం సిట్టింగ్గా ఉండి కూడా.. కొద్ది తేడాతో మంత్రి పదవిని దక్కించుకోలేక పోయిన నాయకులు వచ్చే ఎన్నికల్లో గెలిచి.. తమ కోరిక తీర్చుకోవాలని చూస్తున్నారు. ఈక్రమంలో వారికి ఎవరు అడ్డు వచ్చినా.. సహించేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు . ఇలాంటి వారిలో అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో శింగమనమల నుంచి గెలుపొందిన యామినీ బాలకు బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ హిస్టరీ బాగానే ఉంది.
ఆమె తల్లి శమంతకమణి.. టీడీపీలో బాగానే చక్రం తిప్పారు. ఈ క్రమంలోనే ఆమె సిఫారసుతో యామిని.. టికెట్ తెచ్చు కు ని బరిలోకి దిగి.. తల్లి ప్రోద్బలంతోనే ఎమ్మెల్యే అయ్యారు.ఈ క్రమంలోనే ఆమెకు మంత్రి పదవి వస్తుందని ఆమె చా లా ఆశలే పెట్టుకుంది. అయితే, సమీకరణల్లో భాగంగా యామినికి కొద్ది తేడాతో పదవి దక్కలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో యామిని మరోసారి విజయం సాధించి.. మంత్రి పదవిని చేజిక్కించుకోవాలని భావిస్తున్నారు. కానీ, అనూహ్యంగా ఆమె టికెట్కు సొంతింటి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతుండడం గమనార్హం. వీరిద్దరూ ఇప్పుడు పార్టీపై ఆధిపత్య పోరులో పడ్డారు. వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. కార్యకర్తల్లో చీలిక తీసుకొచ్చారు.
ఇక, వచ్చే 2019 ఎన్నికల్లో శింగనమల నుంచి కూతురును గాక తనయుడు అశోక్ను పోటీ చేయించాలని శమంతకమణి భావిస్తున్నట్టు సమాచారం. దీంతో తల్లీ కూతుళ్ల మధ్య విబేధాలు మొదలయ్యాయి. సోదరుడికి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేద ని.. తనేపోటీలో ఉంటానని యామినీబాల స్పష్టం చేస్తోంది. అయితే ఒక చాన్స్ కూతురుకు, మరో చాన్స్ కొడుకుకు అన్నట్టుగా శమంతకమణి భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్యన పోరు మొదలైంది. విడి విడి సమీక్షలు, విడి విడి వ్యవహారాలు మొదలయ్యాయి. ఇలా తల్లీ కూతుళ్ల మధ్యన టికెట్ పోరు తారా స్థాయికి చేరింది. ఇందుకు సంబంధించి వివాదం చంద్రబాబు వద్దకు ఇప్పటికే చేరిందని సమాచారం. మరి వీరిద్దరిలో చంద్రబాబు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఇదిలా ఉంటే.. మరోపక్క, శింగనమలలో టీడీపీ గెలుపు అంత ఈజీకాదని అంటున్నారు పరిశీలకులు.