టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుపై వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వరుస కామెంట్లతో చెలరేగిపోయారు. విశాఖపట్టణం విమానాశ్రయంలో ఇటీవల వైసీపీ అధినేత జగన్ పై దాడి విషయంలో చంద్రబాబు రాష్ట్రంలో పలు చోట్ల జగన్ కోడి కత్తి డ్రామా ఆడుతున్నారు అంటూ సానుభూతి రాజకీయాలు చేస్తున్నారంటూ ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విటర్ లో భీభత్సమైన కౌంటర్లు వేసారు.
చంద్రబాబు నాయుడు గారూ… మా పార్టీని మీరు కోడి కత్తి పార్టీ అంటూ దిగజారి శునకానందం పొందుతున్నారు మీరు… కావున ఇక మీదట మీ పార్టీని మేం శునకానందం పార్టీగా పిలుస్తామని… అంతే కాకుండా మిమ్మల్ని శునకానంద నాయుడుగా పిలుస్తామని విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లు చేశారు.
అంతటితో ఆగని విజయసాయిరెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)లు, కమిషన్లు చంద్రబాబు చెప్పినట్లుగా నివేదికలు ఇచ్చే వ్యవస్థలన్నది బహిరంగ రహస్యం.. ఇటువంటి నిఘా వ్యవస్థలు అన్ని చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటాయి నిలబడడం అంటే నిలబడతాయి అంటూ విమర్శించారు.
చంద్రబాబు తన ముఖ్యమంత్రి హయాంలో ఇప్పటిదాకా వేసిన నివేదికలు విచారణ కమిటీలు కేవలం తూతూ మంత్రం లాంటివి అని విమర్శించారు. ప్రస్తుతం జగన్ పై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విచారణ మొత్తం డొల్లతనం తో కూడినదని..అసలు నిజం బయటకి రాకుండా చంద్రబాబు ముందే జాగ్రత్తలు తీసుకున్నారని..జగన్ పై దాడి కి ఎవరు పాల్పడ్డారో అందరికీ తెలుసని విజయసాయిరెడ్డి అభిప్రాయపడుతున్నారు.