తెలంగాణలో ఎన్నికల జోరు కొనసాగుతుంది. వచ్చే నెల 7 న జరగబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీ అధినేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తాము చేసిన అభివృద్ది తమను గెలిపిస్తుందని..బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ కే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని..కల్లబొల్లి మాటలకే పరిమితం అయ్యిందని..ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి.
మరోవైపు టి కాంగ్రెస్, టి టీడిపి, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎస్ అధినేత ఎన్నికల గుర్తు ‘అగ్గిపెట్టె’ను ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేశామని, ఎన్నికల కమిషన్ అనుమతి కోసం పంపుతున్నట్టు చెప్పారు. సామాజిక తెలంగాణే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ఆమోదం తర్వాత మేనిఫెస్టో విడుదల చేస్తామని ఆ కాపీలను మరో మూడు రోజుల్లో ఇస్తామని తెలిపారు.
టీజేఎస్ ఎన్నికల మేనిఫెస్టో :