జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రరాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షం లో ఉన్న వైసీపీ పార్టీ కి చుక్కలు చూపిస్తూ జనసేన పార్టీ తరఫున మొదలుపెట్టిన ప్రజాపోరాట యాత్రలో సామాన్యులకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
యాత్రలో భాగంగా ప్రతి కులానికి అండగా ఉంటానంటూ కుల రాజకీయాలు చేయడానికి రాలేదంటూ స్వచ్ఛమైన రాజకీయాలు చేయడానికి వచ్చాను అంటూ..జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యుడు నిర్భయంగా బతకగలడు అని పవన్ కళ్యాణ్ ప్రతి చోటా భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగట్టారు. విభజనతో నష్టపోయి కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడు అవసరమని 2014 ఎన్నికలలో చంద్రబాబుకు మద్దతిచ్చానన్నారు. అయితే పాలనలో అభివృద్ధి కంటే అవినీతిపై అనుభవం పెంచుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
తాను ఎన్టీఆర్ అంత మంచోడిని కాదన…వెన్నుపోటు పొడిస్తే రోడు మీద చొక్కా పట్టుకొని నిలదీస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబునాయుడు హామీలిస్తారని… అధికారంలోకి రాగానే హమీలను విస్మరిస్తారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.పేకాట క్లబ్బులు నడిపే వారికి ఎమ్మెల్యే పదవులు ఎందుకని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.