కామాతురానాం..నభయం..న లజ్జ.. అంటే తెలిసిందే.. పిల్లలకు చదువు నేర్పాల్సిన ఉపాధ్యాయులు ఛండాలం పనిచేస్తూ..అడ్డంగా బుక్ అయ్యారు.   కనీసం తాము పాఠశాలలో ఉన్నామన్న విషయాన్ని కూడా మర్చిపోయి నిసిగ్గుగా ప్రవర్తించారు.  పిల్లలకు విద్యాబోధన చేసి భావి భారత పౌరులను చేయాల్సిన ఉపాధ్యాయులు మైకం కమ్మినట్టు ప్రవర్తించారు..ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను గుర్తుతెలియని వ్యక్తులు ఇంటర్నెట్ లో పెట్టగా అది వైరల్ గా మారింది.

ఈ ఘటన గుజరాత్ లోని దహోద్ జిల్లాలో చోటుచేసుకుంది. దహోద్ జిల్లాలో బామన్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్ మహిళా టీచర్ తో ముద్దుల్లో మునిగిపోయాడు. అయితే ఆ గదిలో సీక్రెట్ కెమెరాను పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, దీన్ని ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. 

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు కామంతో చేసిన ఈ ఛండాలం పని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..వెంటనే స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు.. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: