ఈ మద్య చాలా మంది చిన్న చిన్న ఇబ్బందులతో కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు.  ముఖ్యంగా వైవాహిక విషయాల్లో మనస్పర్థలు రావడం చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు.  తాజాగా కుటుంబ కలహాలకు కలత చెంది ఓ కానిస్టేబుల్ గన్ తో పేల్చుకొని ఆత్మహత్యకు పాల్పపడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం 15 బెటాలియన్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్ గురువారం తెల్లవారుజామున కణతకు తుపాకి గురిపెట్టి కాల్చుకున్నాడు.


ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీనివాస్ మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ఆత్మహత్య పట్ల పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఈ ఆత్మహత్య విషయం బయటకు పొక్కకుండావుండటం తో ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ స్వస్థలం చర్ల మండలం పూజారి గూడెం.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు..ఆత్మ హత్యకు బలమైన కారణం బెటాలియన్ లో వేధింపులా లేక కుటుంబ కలహాల అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: