సర్వేల మాయాజాలం ముదిరి పోతోంది. రెండురోజుల క్రితం ఇండియా టుడే - పి ఎస్ ఈ సర్వే ప్రకారం తెలంగాణాలో టిఆర్ ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఫలితం వస్తే, నిన్న ఏబిపి-సి ఓటర్ ప్రకటించిన సర్వె ఫలితం వెరేలా అంటే మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వచ్చింది. ఇదంతా మీడియా చెసే జిమ్మిక్కులా లేక సర్వేలు యధార్ధాలా? ఏది శాస్త్రీయం అనేది ప్రశ్నార్ధక మౌతుంది. 

abp news c voter opinion poll 2018 on Telangana  కోసం చిత్ర ఫలితం

ముందస్తు ఎన్నికలకు వెళ్లి, మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏబీపీ-సీ ఓటర్ సర్వే షాకిచ్చింది. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిదే విజయమని సర్వే తేల్చి చెప్పింది. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం మహాకూటమికి కలిసొచ్చిందని సర్వే అభిప్రాయపడింది. ఈ సర్వేలో మహాకూటమి 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని..

abp news c voter opinion poll 2018 on Telangana  కోసం చిత్ర ఫలితం

అలాగే కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ కేవలం 42 స్థానాలకే పరిమితమవుతుందని, బీజేపీ 4, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది. గత ఎన్నికల్లో పోలిస్తే టీఆర్ఎస్ ఓట్ల శాతం భారీగా పడిపోతుందని సర్వే తెలిపింది. మహాకూటమికి 33.9% ఓట్లు వచ్చే అవకాశం ఉండగా.. టీఆర్ఎస్‌కు 29.4% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే సర్వేలో, పాల్గొన్న వారిలో 42.9 శాతం మంది కేసీఆరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారట. ఆ తర్వాతి స్థానంలో జానారెడ్డి ఉన్నారు.. ఆయన సీఎం అవ్వాలని 22.6% మంది ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది.

mahakutami in telangana 2018 కోసం చిత్ర ఫలితం

సెప్టెంబర్‌లో మహాకూటమి ఏర్పడింది..తొలుత కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో ప్రారంభమైన కూటమిలో ఆ తర్వాత తెలంగాణ జన సమితి (టీజేఎస్) వచ్చి చేరింది. తొలుత టీఆర్ఎస్‌ కు జనంలో ఊపు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. 

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: