ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇప్పటికే చాలామంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపై పొత్తులపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలపడంతో టిడిపి నాయకులు రానున్న ఎన్నికల్లో ఏపీలో అధికారం లోకి రావడం కష్టమే అనే కామెంట్లు తమలో తాము చేసుకుంటున్నారు.
మరోపక్క వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర తో ప్రజల్లో దూసుకెలిపోత్తు ఉండగా..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఇటువంటి తరుణంలో చాలా మంది టీడీపీ నాయకులు వైసిపి మరియు జనసేన పార్టీ కండువాలు కప్పుకుంటున్న ఈ తరుణంలో..తెలుగు సినిమా రంగానికి చెందిన ఓ నటి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సినీనటి మంజు భార్గవి కలిశారు. ఆమె త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
ఇందుకు సంబంధించి మంజు భార్గవి ...ఏపీ సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా మంజు భార్గవి అనగానే గుర్తొచ్చే సినిమా ‘శంకరాభరణం’. ఆ చిత్రం ద్వారా ఆమె తెలుగులో నటిగా మంచి పేరు సంపాదించారు. అంతేకాకుండా శాస్త్రీయ నృత్యకళాకారిణి అయిన ఆమె...ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. దీంతో ఈమె తెలుగు దేశం పార్టీలో చేరడంతో అటు సినీ రంగంలోని ఇటు రాజకీయ రంగంలో మంజు భార్గవి పెద్ద హాట్ టాపిక్ అయింది.