ఒకసారి అధికారంలోకి వచ్చాక దాన్ని వదలి జీవించటం అసంభవం. మరి పదవీలాలసతో జీవించేవాళ్లకు అది మరీకష్టం. తెలంగాణా నుండి తరిమివేయబడ్ద ఔరంగ జేబు వ్యక్తిత్వం సొంతం చేసుకున్న టిడిపి అధినేత తిరిగి తెలంగాణాలో తన పార్టీని పునఃప్రతిష్టించాలని పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా నైనా తెలంగాణాపై రాజకీయాదిపత్యం చలాయించటం ఆయన సంపద, భవనాలు తదితరాలు కాపాడుకోవటానికైనా అవసరం.
అందుకే తన పాదరక్షల్లాంటివాడైన రెవంత్ రెడ్డి ద్వారా నైనా తన అధికారం నిలబెట్టుకోవటానికి చేసిన “ఓటుకు నోటు కేసు” తో కావలసినంత అప్రతిష్ట మూటకట్టు కొని తెలంగాణా ప్రజల్లో తన పరువు ప్రతిష్టను తలను అవనతం చేసుకున్నా, ఇంకా అధికార దాహంత్గో తప్పును చట్టంద్వారా, న్యాయవ్యవస్థను నియంత్రించైనా అనుకున్నది సాధించాలనే తాపత్రయంతో అదే రేవంత్ రెడ్దిని ఎరగా వేసి కాంగ్రెస్ సరోవరంలో పాదంపెట్టి తద్వారా కాంగ్రెస్ పై పట్టు సాధించాడు.
అయితే తన బందువులో, స్నేహితులో, తన సామాజిక వర్గం వాళ్లో శాసనసభలో ఉండాలన్న అవసరం గుర్తించి వాళ్ల ప్రాభవం నిండుగా ఉండి, సభపై ప్రభావశీలత కలిగి ఉండాలిన్న ఉద్దేశంతో, టిడిపికి అంతగా అవకాశం ఉండని తరుణంలో కాంగ్రెసును, తన సొఫానంగా వాడుకోవటానికి ప్రణాళిక రచించారు.
కాంగ్రెస్ అనామకుడు రాహుల్ గాంధిని రేవంత్ రెడ్ది ద్వారా బుట్టలో పెట్టి తనకు అనుకూలమైన సభ్యులకు శాసనసభ సీట్లు కేటాయించేలా వ్యూహంపన్నాడని ప్రచారం లో ఉంది. అసలు కాంగ్రెసే ఎన్నికల్లో పోటీచెసే సభ్యుల జాబితా చంద్రబాబు అంగీకారంతో విడుదల చేయించిం దని అభిఙ్జవర్గాల కథనం. అంటే తెలంగానాలో కాంగ్రెస్ తరపున ఎన్నిక్కయ్యే సభ్యులంతా బాబుకు ఆమోదయోగ్యులే అవటంతో తన టిడిపి అభ్యర్ధుల సంఖ్య ఆపై ఎంపికపై పట్టుపట్టలేదు.
ఇక తన బందువులు, కులజనులు ప్రత్యక్షంగా శాసనసభ్యులుగా ఉండే ప్రణాళికలో చంద్రబాబు వ్యూహం అద్భుతం. తన స్వజనుడు బాలకృష్ణ మిత్రుడు భవ్య ఆనంద్ ప్రసాద్ శేరిలింగంపల్లి టిడిపి టికెట్ పొందగా - కూకటపల్లి అభ్యర్ధిపై ఎంపిక ప్రస్తుతం జరుగుతుంది.
₹ 500 కోట్ల వెలకు తనకు కాంగ్రెస్ అమ్ముడు పోయినట్లు ప్రచారంలో ఉండగా - మహాకూటమిలో సర్వం తెరవెనుక అంతాతానేయి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ, కూటమి లోని మిగిలిన పార్టీలతో సీట్ల విషయంలో ఎలాంటి పేచి పెట్టకుండా సంయమనం వహిస్తుంది. అదే సమయంలో తనకు బాగా పట్టున్న ప్రాంతాలనే ఎంచుకుని, అక్కడి నుంచి బలమైన తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే ఎన్నికల బరిలోకి దింపుతోంది.
ఈ క్రమంలో తొలి జాబితాలో తొమ్మిది మందిని ప్రకటించింది, అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోని కీలక నియోజకవర్గాలను "సస్పెన్స్" లో పెట్టింది. ఇక హైదరాబాద్ లో తొలి నుంచి తెలుగు దేశానికి పట్టున్న కూకట్పల్లి నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో ప్రదానాంశంగా మారింది.
కూకట్పల్లి నియోజకవర్గం కోసం పార్టీలోని కొందరు సీనియర్లు పట్టుబడుతున్నప్పటికీ తెలుగు దేశం అధినేత క్రియాశీలకంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, గెలుపుగుర్రం ఎక్కటానికి అవకాశం ఉన్నఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో ఒకరిని, అదీ నందమూరి హరికృష్ణ కుటుంబానికే ప్రాధాన్యత నిస్తూ బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ కుటుంబంలోని ఒకరికి ఈ సీటును కేటాయించే అవకాశం కనిపిస్తోందని టిడిపిలో చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టే ఈ విషయాన్ని కల్యాణ్ రామ్ వద్ద ప్రస్తావించగా తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, ప్రస్తుతం తనకు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని తప్పుకున్నట్లు వినిపిస్తుంది.
చివరకు అనేక తర్జనబర్జనల తరవాత హరికృష్ణ కుమార్తె సుహాసినీ టీడీపీ అభ్యర్థిగా ఖరారైనట్లు గా పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ భార్యే సుహాసినీ. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే నందమూరి అభిమానులు మాత్రం ఈ వార్త విని సంబరాలు చేసు కుంటున్నారు.
సుహాసిని మాత్రమే ఎందుకు? జూనియర్ కు చెక్ చెప్పేందుకేనా?