పవన్ కళ్యాణ్ తన ప్రసంగం లో చంద్ర బాబు తో పాటు జగన్ మీద కూడా విరుచు కు పడుతున్నాడు. అయితే పవన్ చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. రాష్ట్రప్రభుత్వ అవినీతిని ఎండగట్టిన పవన్ కళ్యాణ్.. ప్రతిపక్ష నేత జగన్పైనా విమర్శలు గుప్పించారు. ‘మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ప్రజాస్వామ్యంపై మీకు బాధ్యత ఉండాలి. మీరు ఎలాగూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టలేకపోయారు. కనీసం బాధ్యత గల ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లండి. ఒక ఎమ్మెల్యే, ఎంపీ లేని నేనే ఇన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేసి పరిష్కరించగలుగుతున్నప్పుడు.. మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోతే మీరు ప్రజలకు ఏం న్యాయం చేయగలరు.
మీరు ఓదార్పు యాత్రలు చేసుకుంటే సరిపోతుందా? ప్రజలు మీకు ఓట్లు వేసింది మీరు అసెంబ్లీకి వెళ్లి నిలబడాలి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నిలదీయాల్సిన బాధ్యత ప్రజలు మీకు ఇచ్చారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు.. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అప్పుడు మీ మగతనం బయటకు వస్తుంది. మా ఇంటి ఆడపడుచులను తిట్టే ధైర్యం జగన్కి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా వాడు ఏం చేస్తాడులే అనుకుంటున్నారా? మీరు ఎంత రెచ్చగొట్టినా సంస్కారంగా మాట్లాడే గుణం మా తల్లి నేర్పింది’ అంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఆవేశంతో జగన్పై చేసిన మగతనం కామెంట్స్ సోషల్ మీడియాలో పవన్ వర్సెస్ జగన్గా మారాయి. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు పార్టీకి అండగా ఉండి ఆ పార్టీని అందలం ఎక్కించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అవినీతిలో భాగమే అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ సింగిల్గానే చంద్రబాబుని ఢీకొన్నారని.. చంద్రబాబు, పవన్లు కలిసినా జగన్కి 67 సీట్లు వచ్చాయన్నారు. అదీ జగన్కి ఉన్న మగతనం. దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఇందులో సగం సీట్లు గెలుచుకుంటే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని సవాల్ విసురుతున్నారు వైసీపీ శ్రేణులు.