తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్,మంత్రులు కెటిఆర్, హరీష్ రావులపైన, టిఆర్ఎస్ నేతలపైన టిడిపి నేతలు ఎన్నికల ముఖ్య అదికారికి ఫిర్యాదు చేశారు.అందులో తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబుపై చేసిన విమర్శలను ప్రస్తావించారు. అవన్ని ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉన్నాయనివారు పేర్కొన్నారు.
ఆ అంశాలు ఇలా ఉన్నాయి.
*చంద్రబాబు ఆంద్ర రాక్షసి..
*కెసిఆర్నేను మూడో కన్ను తెరిస్తే..నీ గతేంకాను నీతో పొత్తా ..ఛీఛీ..!
*తెలంగాణ ఆంద్రులకు చంద్రబాబు శని
*చంద్రబాబు పెద్ద కుట్రదారుడు..ఇక్కడ పెత్తనం చేయాలని చూస్తున్నారు
*కూటమి అదికారంలోకి వస్తే మన జుట్టు చంద్రబాబు చేతికి
*చంద్రబాబు డబ్బుతో గెలవాలని చూస్తున్నారు..
*బాబు కుట్రలు..నోట్ల కట్టలు...కాంగ్రెస్ ది బానిస బతకు..బాబు ముందు ఉత్తం చేతులు కట్టుకుని నిలబడ్డాడు..
*ఆంద్ర సొమ్ములు ఇక్కడకు తరలించారు.
*₹500 కోట్లతో రాహుల్ తో చంద్రబాబు డీల్ అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈ నేతలపై చర్య తీసుకోవాలని తెలంగాణ టిడిపి నేతలు పిర్యాదు చేయడం విశేషం.