విశాఖపట్టణం విమానాశ్రయంలో తనపై హత్యాయత్నం జరిగిన తరువాత చాలా రోజుల వరకు విశ్రాంతి తీసుకున్న వైసీపీ అధినేత జగన్..తాజాగా మళ్లీ ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ క్రమంలో గాయపడ్డ జగన్ ఇప్పటికే మూడు రోజులు పాదయాత్ర చేశారు.

Image may contain: 7 people, people smiling, plant, crowd, tree and outdoor

అయితే తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఇప్పటివరకు మీడియా ముందు మాట్లాడని జగన్ తొలిసారి భారీ బహిరంగ సభలో జగన్ నోరు విపుతున్న నేపద్యంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నేతలు మరియు జాతీయ నేతలు జగన్ ఎటువంటి స్పీచ్ ఇస్తారో ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా జగన్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు మరియు డిజిపి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడంతో జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి చాలా అనుమానాలు నెలకొన్నాయి.

Image may contain: 8 people, outdoor

ఈ క్రమంలో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేసిన..తెలుగుదేశం పార్టీ మాత్రం జగన్ పై జరిగిన దాడికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని..జగన్ కావాలనే తనపై తాను దాడి చేయించుకున్నారని ఆరోపించడం జరిగింది.

Image may contain: 1 person, crowd and outdoor

ఈ క్రమంలో ఇటీవల విజయనగరం లో పాదయాత్ర చేస్తున్న జగన్ పార్వతీపురం లో జరిగే బహిరంగసభలో ఏటువంటి ప్రసంగం చేస్తారో అంటూ తెలుగు రాజకీయాలలో ఆసక్తి నెలకొంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: