పవన్ కళ్యాణ్ ఒక్కొ  సమయం లో ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. ఒకదానికొకటి పొంతన ఉండదు నోటికేదొస్తీ అది మాట్లాడతాడు.  తాజాగా జగన్ మీద కస్సుమన్నాడు. జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు, జగన్ ఎందుకు తెలంగాణ నేతలను విమర్శించడం లేదు.. అంటూ పవన్ రెచ్చిపోయాడు. అసెంబ్లీ విషయంలో వైసీపీ ఇప్పటికే బోలెడన్ని సార్లు వివరణ ఇచ్చింది.


జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!

పాతికమంది ఇటు ఎమ్మెల్యేలు అటువైపు వెళ్లి కూర్చున్నారు.. అది అసెంబ్లీనా? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. అయితే ఫిరాయింపుదారుల విషయంలో అప్పుడూ పవన్ కల్యాణ్ స్పందించ లేదు, ఇప్పుడూ స్పందించలేదు. ఇక జగన్ ఎందుకు తెలంగాణ నేతలను విమర్శించడం లేదు అని పవన్ అంటున్నాడు. ఇదో అర్థంలేని మాట. ఎందుకంటే.. తెలంగాణ నేతల కాళ్ల దగ్గరకు వెళ్లింది పవన్ కల్యాణే. తన సినిమా అజ్ఞాతవాసి ప్రీమియర్ షోల అనుమతి కోసం తనే స్వయంగా కేసీఆర్ వద్దకు వెళ్లాడు పవన్ కల్యాణ్.


జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!

కేసీఆర్ పాలన గురించి తెగ ప్రశంసించాడప్పుడు. అంతచేసినా.. అజ్ఞాతవాసికి కేసీఆర్ కరుణ దక్కలేదనుకోండి. తన సినిమా ప్రీమియర్ షోల కోసం అంతకు దిగజారిన పవన్ కల్యాణ్.. తెలంగాణ నేతలను జగన్ విమర్శించడం లేదని వాపోవడం నిజంగా కామెడీ. ఇలాంటి కామెడీలు పవన్ కు బాగా అలవాటు అయిపోయాయి. ఇక వైసీపీ నుంచి ఇప్పుడు పవన్ మీద ఘాటుగానే విమర్శలు వచ్చాయి. పవన్ ప్రస్తావించిన ప్రతి అంశాన్నీ పట్టుకుని వైసీపీ నేతలు పేర్నినాని, కురసాల కన్నబాబులు కడిగేశారు. వారు పలు అంశాలను లేవెనెత్తారు. వాటికి ఎలాగూ పవన్ కౌంటర్ ఇవ్వలేడు అనుకోండి!

మరింత సమాచారం తెలుసుకోండి: