ఎన్నికలు దగ్గర పడుతున్న కొలదీ ప్రజాపోరాట యాత్రలో దూసుకెళ్ళిపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో ఓ భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి బయలుదేరుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వీటిలో ప్రమాదం తప్పింది.

Image may contain: 1 person, standing

ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని అతివేగంగా ఓ లారీ ఢీకొనడంతో ఆ వాహనంలో ఉన్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి..ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారు కి ఎటువంటి డామేజ్ జరగకపోవడంతో అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Image may contain: 10 people, people smiling, people standing and outdoor

తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు కాకినాడ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ  ఢీకొట్టిన కారులో పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి.

Image may contain: 5 people, people standing

వారందరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ప్రమాదంలో పవన్ కళ్యాణ్ ప్రవేటు భద్రతా సిబ్బంది ఏడుగురు గాయపడినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ కూడా పెద్ద గాయాలు కాలేదు కేవలం చిన్న చిన్న గాయాలతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు తెగ కంగారు పడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: