హరికృష్ణ కూతురు సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం ఖరారు అయిపొయింది. అయితే నందమూరి హీరోలైనా ఎన్టీఆర్ కు మరియు కళ్యాణ్ రామ్ కు అస్సలు ఇష్టం లేదని తెలుస్తుంది. ఆమె శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. నా తెలంగాణ ప్రజలందరికీ.. మీ ఇంటి ఆడబిడ్డగా, నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ ప్రసంగం.. మీ నందమూరి సుహాసిని' అంటూ ఆమె తన మీడియా సమావేశాన్ని ప్రారంభించారు.

చంద్ర బాబు చేసిన పనికి కోపం తో జూనియర్ ఎన్టీఆర్...!

తన పైన నమ్మకం ఉంచి, తాను ప్రజలకు సేవ చేస్తానని నమ్మి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున తనకు కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం సీటును కేటాయించారని, అందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. మా తాతగారు ఎన్టీఆర్ ప్రజలకు సేవ చేయాలని టీడీపీని స్థాపించారని, తన తండ్రి హరికృష్ణ తన తాతకు రథసారథిగా పని చేసి, ప్రజలకు చేరువ అయ్యారని సుహాసిని గుర్తు చేశారు. నా చిన్నప్పటి నుంచి లక్షలసార్లు ప్రజలే మన దేవుళ్లు, వారికి ఎల్లప్పుడూ సేవ చేయాలని వారు తనకు చెప్పేవారని, దానిని స్పూర్తిగా తీసుకొని, తనవంతు సేవ చేసేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. 


చంద్ర బాబు చేసిన పనికి కోపం తో జూనియర్ ఎన్టీఆర్...!

మరింత సమాచారం తెలుసుకోండి: