తెలంగాణలో వచ్చే నెల ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ముందుకు సాగుతుంది.  ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ ని ఓడించాలనే ఉద్దేశ్యంతో టి కాంగ్రెస్, టీటిడిపి, టిజెఎస్, సిపీఐ తో పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడింది.  అయితే ఇప్పటి వరకు సీట్ల సర్ధుబాటు విషయంలో తర్జనభర్జన జరుగుతూ వచ్చింది. 


కాగా మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగిలిన 25 సీట్లను మిత్రపక్షాలు టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు కేటాయించింది.  తాజాగా 13 మందితో మూడో జాబితా విడుదల చేసింది.   మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. 

మూడో జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు:

బోథ్ (ఎస్టీ) - సోయం బాపూరావు
నిజామాబాద్ అర్బన్ - తహెర్ బిన్ హమ్దాన్
నిజామాబాద్ రూరల్ - రేకుల భూపతి రెడ్డి
బాల్కొండ - ఇ అనిల్ కుమార్ 
లాల్ బహదూర్ నగర్ - డి సుధీర్ రెడ్డి
కార్వాన్ - ఒస్మాన్ బిన్ మొహమ్మద్ అల్ హజ్రి
యాకత్ పురా - కె రాజేందర్ రాజు
బహదూర్ పురా - కలీం బాబా
కొల్లాపూర్ - బీరం హర్షవర్ధన్ రెడ్డి
దేవరకొండ (ఎస్టీ) - బాలు నాయక్
తుంగతుర్తి (ఎస్సీ) - అద్దంకి దయాకర్
జనగాం - పాన్నాల లక్ష్మయ్య
ఇల్లెందు (ఎస్టీ)- బానోతు హరిప్రియ నాయక్.



మరింత సమాచారం తెలుసుకోండి: